టెక్నాలజీ వేగంగా విస్తరిస్తుండటం, ప్రతి ఒక్కరికీ సామాజిక మాధ్యమాలు చేరువవుతుండటం గమనించిన మెగాస్టార్ రీసెంట్గా సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ట్విట్టర్ ద్వారా అభిమానులతో రెగ్యులర్గా టచ్లో ఉంటున్న ఆయన.. ప్రతి విషయాన్ని కూడా సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ అప్డేట్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మెగా పవర్ స్టార్ రామ్చరణ్ తేజ్కి ఓ విచిత్రమైన ప్రశ్న ఎదురైంది. ఈ వయసులోనూ సోషల్ మీడియాలో ఇంత యాక్టివ్గా ఉన్న చిరంజీవిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీనిపై మీ స్పందన ఏంటని అడగ్గా అసలు విషయం చెప్పేశారు. ''నేను ఎంటర్ అవుతున్నాను.. నువ్వు జాగ్రత్త చరణ్ అని సోషల్ మీడియా ఎంట్రీని ఉద్దేశిస్తూ నాన్న ముందే హెచ్చరించారు. వచ్చాక చెప్పినట్లుగానే యమ యాక్టివ్గా ఉంటూ కొత్త టెక్నాలజీని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు'' అని రామ్ చరణ్ తెలిపారు. ఇక తన లేటెస్ట్ మూవీ అందరికీ సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చెప్పారు రామ్ చరణ్. ఎన్టీఆర్, తన క్యారెక్టర్ పట్ల రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, ఈ సినిమా డెఫినెట్గా ప్రేక్షకుల అంచనాలకు మించి థ్రిల్ చేస్తుందని చెప్పారు. అయితే ఈ పరిస్థితుల్లో తిరిగి RRR షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో మాత్రం చెప్పలేనని ఆయన అన్నారు. మరోవైపు మెగా, నందమూరి అభిమానులు ఈ సినిమాపై భారీ హోప్స్ పెట్టుకున్నారు.
from https://ift.tt/2PYm3rt
No comments:
Post a Comment