ఏరా నేను ప్రజల డబ్బు తిన్నానా? లఫంగి నా** అంటూ రెచ్చిపోయిన తెలుగు హీరోయిన్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Sunday 10 May 2020

ఏరా నేను ప్రజల డబ్బు తిన్నానా? లఫంగి నా** అంటూ రెచ్చిపోయిన తెలుగు హీరోయిన్

‘నచ్చావులే’ హీరోయిన్ మాధవీలతకు కోపం వచ్చింది.. ఈ మధ్యనే బీజేపీ యువ నాయకురాలుగా మారిన తరువాత నుంచి మరింత డోస్ పెంచిన మరోసారి నోటికి పనిచెప్పింది. ‘హీరోయిన్‌గా, పొలిటికల్‌గా ప్రజల డబ్బు తిన్నావ్.. ప్రజలకు సాయం చేయొచ్చుగా కదా.. పాపం ప్రజలు లాక్ డౌన్ ఇబ్బందుల్లో ఉన్నారు’ అని ఈమెను రెచ్చగొట్టడంతో.. నీ అబ్బ సొమ్ము నాకేమైనా ఇచ్చావ్రా.. అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యింది మాధవీలత. ఇంతకీ ఈమె ఎవర్ని అన్నదో చివర్లో చూద్దాం కాని.. ముందు అమ్మడు నోటి నుంచి వచ్చిన ముత్యాల్ని ఓ మారు లెక్కింద్దాం.. ‘ఈ మధ్య ప్రతివాడికి ఫ్యాషన్ అయిపోయింది.. ఏ చిన్న విషయం జరిగినా సినిమా వాళ్లపై పడి ఏడ్వటమే. సినిమా వాళ్లు ప్రజల డబ్బు తిన్నారు కదా.. ఇలాంటి టైంలో సాయం చేయొచ్చు కదా అని.. ఎవడు తిన్నాడ్రా? ప్రజల డబ్బు? ఏ వాళ్లు ఏమైనా దోచుకున్నారా? ప్రజల డబ్బుని రాజకీయ నాయకుల్లాగ..? లేక బిజినెస్ మ్యాన్‌ల లాగ బ్యాంక్‌లకు సొమ్ములు ఎగ్గొట్టారా? కష్టపడి పనిచేస్తే రెమ్యునరేషన్‌లు ఇస్తున్నారు. ఆఖరుకి నన్ను కూడా అంటున్నారు.. అరేయ్!! అసలు మీకు సిగ్గుందరా? తెలుగు సినిమా హీరోయిన్ రెమ్యునరేషన్ మీకు తెలుసరా? సినిమాకి పనిచేసే కార్మికుడి ఇచ్చే రెమ్యునరేషన్ కూడా ఉండదు హీరోయిన్‌కి. ప్రజల సొమ్ము తిన్నావు.. ఇప్పుడు పెట్టడానికి ఏంటి అంటున్నారు. రాజకీయాల్లో తినడానికి ఏం ఉండదు.. పదవులు వస్తేనే తింటారు. లేదంటే మన సొమ్మేపెట్టాలి. నువ్ తీసుకుని రారా.. ఏదో నీ బాబుగాడి సొమ్ము నాకు పెట్టినట్టు ప్రజల సొమ్ము నేను తిన్నానని ప్రతి వాడు కామెంట్ చేయడం. నువ్ చేశావారా?? నేను ప్రజల సొమ్ము తిన్నది. లఫంగి నా కొడుకులు అందరూ కామెంట్లు పెడతారు’ అంటూ రెచ్చిపోయింది మాధవీలత. అరే.. మరీ ఈరేంజ్ ఫుడ్ బాల్ ఆడేసింది ఎవర్నబ్బా అంటే.. అతని పేరు డైరెక్ట్‌గా చెప్పకపోయినప్పటికీ.. వివాదాస్పద కొరియోగ్రాఫర్ ఈ వీడియోకి కౌంటర్ ఇస్తూ తాట తీస్తా.. జప్ఫా అంటూ మాటల దాడి చేయడంతో ఈమె అన్నది ఆయన్నేనా అని అనుమానాలు మొదలయ్యారు. ‘ఏం మాట్లాడుతున్నావ్.. కార్మికుడికి ఇచ్చినంత కూడా నీకు రెమ్యునరేషన్ ఇవ్వలేదా?? సిగ్గు ఉందా? నీకు ఆ మాట చెప్పడానికి? ప్రజల సొమ్ము తిన్నానా అని అంటున్నావ్.. నీకు ఇచ్చినది ప్రజల సొమ్ము కాకపోతే నీ అబ్బ సొమ్మా?? ప్రజలు థియేటర్స్‌కి వచ్చి సినిమా టిక్కెట్ కొంటేనే నీకు రెమ్యునరేషన్ ఇస్తారు. ప్రజల గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నీ బండారం మొత్తం బయటపెడతా.. ఇంకోసారి ప్రజల్ని కామెంట్స్ చేస్తే చెప్పుతీసుకుని కొడతారు.. నటనను నేర్చుకుని హీరోయిన్ అవ్వు’.. అంటూ క్యాస్టింగ్ కౌచ్ ఉదంతంలో మాధవీలత పేరుని లేవనెత్తారు రాకేష్ మాస్టర్.


from https://ift.tt/3dxQoH6

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages