బుల్లితెరపై యాంకర్గా చేస్తూనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. మాటల గారడీ చేస్తూ మంచి ఫాలోయింగ్ కూడగట్టుకుంది. ఆ తర్వాత బిగ్బాస్ సీజన్ 3లో ఛాన్స్ పట్టేసి హుషారెత్తించింది. బిగ్బాస్ హౌస్లో ఆమె చేసిన హంగామా చివరకు రన్నరప్గా నిలిపింది. దీంతో పాపులారిటీ అమాంతం పెరిగి ఫాలోయింగ్ రెట్టింపయింది. ఈ క్రమంలోనే సిల్వర్ స్క్రీన్పై కూడా రాణించాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది శ్రీముఖి. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా ''. ఈ రోజు (మే 10) శ్రీముఖి పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో చేతిలో తుపాకీ పట్టి గ్లామర్ లుక్లో దర్శనమిచ్చింది శ్రీముఖి. ఈ మూవీతో గౌతమ్ ఇ.వి.ఎస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బుల్లితెర రాములమ్మ శ్రీముఖి ముఖ్యపాత్ర పోషిస్తుండగా.. దితిప్రియ భట్టాచార్య, మాయ నెల్లూరి, క్రిష్ సిద్దిపల్లి, బాషా మొహిద్దిన్ షేక్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఎయిన్స్ మోషన్ పిక్చర్స్, కాక్ టైల్ సినిమాస్ పతాకంపై అల్లం సుభాష్, గౌతమ్ ఇ.వి.ఎస్ నిర్మిస్తున్నారు. శేఖర్ మోపూరి సంగీతం అందిస్తున్నారు. Also Read: ఈ సందర్భంగా దర్శక నిర్మాత గౌతమ్ ఇ.వి.ఎస్ మాట్లాడుతూ "ఇదొక సైబర్ క్రైమ్ థ్రిల్లర్. నాలుగు పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. ప్రస్తుత సమాజంలో యువతరం జీవితాలకు అద్దం పట్టేలా ఈ మూవీ ఉంటుంది. సినిమాలో శ్రీముఖి గారు ఫుల్ లెంగ్త్ రోల్ చేయడం లేదు. కానీ, ఆమెది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఇంతకు ముందెప్పుడూ ఇటువంటి పాత్రలో శ్రీముఖి నటించలేదు. ఆమె అభిమానులకు, ప్రేక్షకులకు ఈ క్యారెక్టర్ సర్ప్రైజ్ ఇస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాం" అన్నారు.
from https://ift.tt/2WEUara
No comments:
Post a Comment