జగదేకవీరుడు అతిలోకసుందరి సీక్వల్.. చిన్న డౌట్ అంటూ ట్విస్ట్ రివీల్ చేసిన నాని - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Sunday 10 May 2020

జగదేకవీరుడు అతిలోకసుందరి సీక్వల్.. చిన్న డౌట్ అంటూ ట్విస్ట్ రివీల్ చేసిన నాని

తెలుగు సినిమా చరిత్రలో '' సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. వైజయంతి మూవీస్‌ బ్యానర్ పై అశ్వినీదత్ రూపొందించిన ఈ మూవీ రికార్డులను తిరగరాసింది. ఈ చిత్రం విడుదలై నిన్నటితో (మే 9) 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమా షూటింగ్, విడుదల సమయంలో జరిగిన విషయాలను పేర్కొంటూ 'జగదేకవీరుడు అతిలోకసుందరి' సీక్వల్‌పై హింట్ ఇచ్చారు హీరో నాని. ఈ సందర్భంగా ''వింటేజ్ వైజయంతి'' పేరుతో ఈ వీడియోను పంచుకుంది వైజయంతి సంస్థ. ఇందులో నాని మాట్లాడింది ఉన్నది ఉన్నట్లుగా మీ ముందుంచుతున్నాం. ''జగదేకవీరుడు అతిలోకసుందరి.. మాములు సినిమా కాదు. మరి దాని రిలీజ్ మాములుగా ఎలా ఉంటుంది? 1990 మే 9న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. అప్పట్లో అతి పెద్ద బడ్జెట్. పాటలు ముందే విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అన్నీ బాగున్నాయనుకుంటున్న టైమ్. సరిగ్గా అదే టైమ్‌కి అంటే 6వ తారీఖున తుఫాన్ వార్తలు మొదలు. సినిమా ప్రింట్స్ కూడా ఎలా పంపించాలో తెలియని పరిస్థితి. భారీ వర్షాల దెబ్బకి ఎక్కడి రైళ్లు అక్కడే ఆగిపోయాయి. చెట్లు, కరెంట్ స్థంబాలు కూలిపోయి రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయిపోయింది. ప్రింట్స్ పంపండం ఎలా? కానీ రిలీజ్ ఆపకూడదు. తుఫాన్‌ను ఎదురించి చెప్పిన డేట్‌కి రిలీజ్ చేయాలని పట్టు. థియేటర్స్‌లో కూడా మోకాలిలోతు నీళ్లు. చివరికి ప్రొజెక్టర్ రూమ్‌లో కూడా నీళ్లే. అలాగే పాపం అక్కడక్కడా మార్నింగ్ షోలు పడ్డాయి. ఎన్నో అంచనాలున్న అంత భారీ సినిమా కళ్ల ముందు భవిష్యత్ నీటిపాలైపోతుంది. చేసిన పబ్లిసిటీ అంతా వర్షానికి మట్టికొట్టుకుపోయింది. ఇక కూర్చుని బాధపడితే ప్రయోజనం లేదు. విజయవాడ వెళ్లి ప్లాన్ చేద్దామని, అశ్వనీదత్‌గారు, రాఘవేంద్రరావుగారు విజయవాడ వెళ్లారు. 11వ తేదీన విజయవాడ వెళ్లగానే ముందు రాఘవేంద్రరావుగారిని మనోరమ హోటల్‌లో దించి దత్తుగారు తన ఇంటికి తీసుకెళ్లారు. ఇంట్లో కరెంట్ లేదు. ఒక చిన్న లాంతర్ వెలుగులో దత్తుగారి శ్రీమతి, ఫాదర్ ధర్మరాజుగారు, దత్తుగారి ముగ్గురు ఆడపిల్లలు భోజనం చేస్తున్నారు. ఇంట్లో చీకటి.. దత్తుగారి మనసులో చీకటి. అప్పుడు దత్తుగారు చాలా నిరాశగా ఇదే.. నా ఆఖరి సినిమాయేమో? అన్నారు ఫాదర్‌తో. ఆ మహానుభావుడు వెంటనే.. ఏం పరవాలేదు. మంచి సినిమా తీశావ్. సెటిలవుతుంది.. ముందు నీవు భోజనం చెయ్ అని ధైర్యం చెప్పారు. ఆ మరునాడు పక్కనే ఉన్న గుంటూరు మంగా థియేటర్‌కు దత్తుగారు, రాఘవేంద్రరావుగారు కలిసి వెళితే.. అక్కడ వాతావరణం వేరేగా ఉంది. క్లాస్ ఆడియన్స్ ఉండే బాల్కనీలో మాస్ ఆడియన్స్‌లా రెచ్చిపోతున్నారు. చప్పట్లు, ఈలలు గోలగోల. ఆశ్చర్యం.. చిన్న ధైర్యంతో గుంటూరు నుంచి తెనాలి బయలుదేరారు దర్శకనిర్మాతలిద్దరూ. అప్పుడే ఓ మరపురాని సంఘటన. ఎన్.టి. రామారావుగారు ఆ టైమ్‌లో మాజీ ముఖ్యమంత్రి. ప్రతిపక్షనాయకుడి హోదాలో తుఫాన్ ప్రాంతంలో టూర్ చేస్తూ.. అక్కడ ఎదురయ్యారు. దత్తుగారు, రాఘవేంద్రరావుగారు కారు ఆపి, ఆయనని కలిశారు. ఎన్టీఆర్‌గారు అప్పుడు గంభీర్యంగా.. ‘‘సినిమా రిపోర్ట్ బాగుంది. సెటిలైపోతుందిలే బ్రదర్.. కంగారు పడకండి, నేను చెబుతున్నాను..’’ అని ధైర్యం చెప్పి తన పనిలోకి వెళ్లిపోయారు. ఆయన దగ్గర నుంచి వచ్చి కారు ఎక్కబోతుంటే.. ఓ పల్లెటూరి వ్యక్తి సైకిల్ మీద అరటిపళ్లతో వస్తూ.. దత్‌గారిని, రాఘవేంద్రరావుగారిని చూసి పరుగెత్తుకుంటూ వచ్చి ‘ఇప్పుడే సినిమా చూశాను. అదిరిపోయింది. సంవత్సరం ఆడుద్ది’ అని గట్టిగా అరిచాడు. దర్శకనిర్మాతలిద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక అక్కడి నుంచి సినిమా విజయవిహారం. నాన్‌స్టాప్‌గా ఊరూరా.. వాడ వాడ చెలరేగిపోయింది. తుఫాను, వర్షం, ఆ భీభత్సం ఏవీ జగదేకవీరుడు అతిలోకసుందరిని ఆపలేకపోయాయి. ప్రతి షో హౌస్‌ఫుల్. పడవల్లో టౌన్‌కి వచ్చి మరీ సినిమా చూశారు. ల్యాండ్ మార్కెట్స్ వూరకే వస్తాయా? తెలుగు సినిమా చరిత్రలోనే జగదేకవీరుడు అతిలోకసుందరి ఓ తుఫాన్. 30 యేళ్లు అయింది. కానీ ఓ చిన్న డౌట్ మిగిలిపోయింది. ఉంగరం ఏమైంది? ఉంగరం మింగిన చేప ఏమైంది?'' అంటూ నాని ఈ సినిమా సీక్వెల్‌ ట్విస్ట్ రివీల్ చేస్తూ ముగించారు.


from https://ift.tt/3fzMDCy

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages