లాక్‌డౌన్ పొడిగిస్తే ఆలోచిస్తాం.. క్లారిటీ ఇచ్చిన రాజ్ తరుణ్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Saturday, 11 April 2020

లాక్‌డౌన్ పొడిగిస్తే ఆలోచిస్తాం.. క్లారిటీ ఇచ్చిన రాజ్ తరుణ్

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఓరేయ్ బుజ్జిగా’. కొండా విజయ్‌కుమార్ దర్శకత్వం వహించారు. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ నిర్మించారు. మార్చి 25న ఈ సినిమా విడుదలకావాల్సింది. అయితే, కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా 21 రోజులపాటు లాక్‌డౌన్ విధించడంతో సినిమా విడుదల ఆగిపోయింది. థియేటర్లు మూతబడటంతో అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫాంలకు డిమాండ్ పెరిగింది. దీంతో ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదల చేస్తున్నారనే రూమర్ ఈ మధ్య బాగా వినిపించింది. అయితే, ఈ రూమర్‌ను నమ్మొద్దని.. పరిస్థితులు చక్కబడిన తరవాత సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని ఇటీవల చిత్ర నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది. ఇదే విషయంపై హీరో రాజ్ తరుణ్‌ను ‘సమయం’ సంప్రదించింది. కాసేపు ఆయనతో ముచ్చటించింది. ప్రస్తుతానికి అయితే ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాను ఓటీటీలో విడుదల చేసే ప్లాన్ లేదని చెప్పారు. ఒకవేళ లాక్‌డౌన్ సమయం ఇంకా పొడిగిస్తే గనుక ఓటీటీ రిలీజ్‌పై ఆలోచిస్తామని వెల్లడించారు. లాక్‌డౌన్ సమయంలో ఆయన లైఫ్‌స్టైల్ గురించి స్పందిస్తూ.. ‘‘నేను ఎక్కువగా బయటికి వెళ్లను. ఇంట్లోనే ఉంటాను. సినిమా షూటింగ్‌లు వెళ్లడం తప్ప ఇంకెక్కడికీ వెళ్లను. కాబట్టి, నాకు పెద్దగా తేడా ఏమీ కనిపించడం లేదు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్క్రిప్ట్‌లు వింటున్నాను’’ అని రాజ్ తరుణ్ చెప్పారు. Also Read: లాక్‌డౌన్ వల్ల కాలుష్యం బాగా తగ్గిందని అంతా అంటున్నారు. దీనిపై కూడా రాజ్ తరుణ్ స్పందించారు. ‘‘కాలుష్యం తగ్గడం, వాతావరణం మెగురుపడటం మంచిదే. కానీ, ఈ లాక్‌డౌన్ వల్ల ఎంతో మంది జీవితాలు ఇబ్బందుల్లో పడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా పనులన్నీ ఆగిపోవడం వల్ల ఎంతో మంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు’’ అని రాజ్ తరుణ్ వెల్లడించారు. ఈ లాక్‌డౌన్ సమయంలో జీతాలు లేక ఇబ్బందిపడుతోన్న తన స్నేహితులకు ఆర్థికంగా తాను సహాయం చేస్తున్నానని చెప్పారు. అయితే, కరోనా క్రైసిస్ ఛారిటీకి తాను విరాళం ఇవ్వలేదని తెలిపారు.


from https://ift.tt/2wwEzRz

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages