
నటుడు, నిర్మాత మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. అసలేం జరిగిందనే వివరాల్లోకి వెళితే.. ఒంగోలు ముప్పాళ్ల గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి బండ్ల గణేష్ రూ.1 కోటి 25 లక్షల రూపాయల చెక్ను ఇచ్చారు. ఆ చెక్ బౌన్స్ అయ్యింది. దీనిపై సదరు జెట్టి వెంకటేశ్వర్లు కోర్టును ఆశ్రయించారు. విచారణకు హాజరు కావాలంటూ పలుసార్లు ఆదేశాలు వెళ్లినప్పటికీ బండ్ల గణేష్ సైడ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. దీంతో ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టు జడ్జి బండ్ల గణేష్ను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరచాలని పోలీసులకు ఆదేశాలను జారీ చేశారు. ఇది వరకు ఇలాంటి కేసులోనే పోలీసులు బండ్ల గణేష్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. గతంలో కడప జిల్లాకు చెందిన మహేష్ అనే వ్యక్తి దగ్గర 1కోటి 30 లక్షల రూపాయలు అప్పు తీసుకుని చెల్లించలేదు. మహేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణకు హాజరు కావాలని చెప్పినా ఆయన వినకపోవడంతో కడపజిల్లా మెజిస్ట్రేట్ బండ్ల గణేష్పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.
from https://ift.tt/3Ew3NfF
No comments:
Post a Comment