ఉత్త చేతులతో ఇండస్ట్రీకి వచ్చి కోట్లు సంపాదించా.. ఆ విషయం చెబుతూ శ్రీ విష్ణు ఎమోషనల్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Wednesday, 29 December 2021

demo-image

ఉత్త చేతులతో ఇండస్ట్రీకి వచ్చి కోట్లు సంపాదించా.. ఆ విషయం చెబుతూ శ్రీ విష్ణు ఎమోషనల్

Responsive Ads Here
photo-88579191
కెరీర్ ఆరంభం నుంచే వైవిద్యభరితమైన కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నారు యంగ్ హీరో శ్రీ విష్ణు. సినిమా సెలక్ట్ చేసుకోవడంలో ఆయనకంటూ ఓ స్టైల్ ఉంటుందని ఇప్పటిదాకా చేసిన సినిమాలతో ప్రూవ్ చేశారు. అలాంటి మరో విలక్షణ కథ ''తో ప్రేక్షకుల ముందుకొచ్చి సందడి చేసేందుకు సిద్దమయ్యారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తేజ మర్ని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. డిసెంబర్ 31న థియేటర్లలో ఈ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేదికపై హీరో శ్రీ విష్ణు మాట్లాడిన మాటలు అందరినీ అట్రాక్ట్ చేశాయి. దర్శకుడు తేజ చాలా టాలెంటెడ్ అని చెప్పిన శ్రీ విష్ణు.. దాదాపు షూటింగ్ మొత్తం కూడా గోదావరి జిల్లాలోనే జరిగిందని, ఈ సినిమా చూశాక ఇది మా గోదావరి జిల్లాల గొప్పతనం అని అక్కడి జనం కాలర్ ఎగరేసి చెప్పుకుంటారని నమ్మకంగా చెబుతున్నా అన్నారు. 55 రోజులపాటు కంటిన్యూస్‌గా షూట్ చేశామని, ఈ చిత్ర నిర్మాణంలో నిర్మాతలు చాలా ఫ్రీడమ్ ఇచ్చారని, అవుట్‌పుట్ చాలా అద్భుతంగా రావడానికి కారణం నిర్మాతలే అని తెలిపారు. ఈ సినిమాలో ప్రతి ఆర్టిస్ట్ ఇరగదీశారని, సినిమా చూశాక అది మీరే చెబుతారని అన్నారు. ఇకపోతే సినిమాల్లోకి తాను ఉత్త చేతులతో వచ్చాను కానీ ఈ రోజు తన వద్ద చాలా ఆస్తి ఉందని, అది కోట్ల కంటే విలువచేసేదంటూ ఆసక్తికరంగా మాట్లాడారు శ్రీ విష్ణు. 'నేను పరిచయం చేసిన దర్శకులే నా ఆస్తి. అది సినిమా సినిమాకు ఓ రేంజ్‌కి వెళ్ళిపోతుంది. అందులో డౌట్ లేదు' అంటూ భావోద్వేగంతో శ్రీ విష్ణు చెప్పడం విశేషం. మా సినిమాలో రియల్ ఎస్టేట్ భూమ్ ఉందని, ఈ సినిమా చూశాక అది మీకే తెలుస్తుందని అన్నారు శ్రీ విష్ణు. ఇకపోతే ఈ సినిమాలో మేమందరం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని తెలిపారు. తాను సినెమానెప్పుడూ క్లాస్, మాస్ కథ అని చూడలేదని కేవలం కథనే నమ్మానని చెప్పారు. అయితే నాకు మాస్ కథలు పనికిరావని తన స్నేహితులు అనేవారని, మాస్‌ చిత్రాలకు పనికొస్తానో లేదో డిసెంబర్ 31న మీరే చెప్పండి అని శ్రీ విష్ణు అన్నారు. ఈ సందర్భంగా 'అర్జున్ ఫల్గుణ' సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా ఆయన కృతజ్ఞతలు చెప్పారు.


from https://ift.tt/3qu02Cy

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages