తమ అభిమాన నటుడు ఏ సినిమాలో నటిస్తున్నాడు.. దానికి దర్శకుడు ఎవరూ.. ఆ సినిమా కథాంశం ఏంటీ అని అభిమానలు ఎంతో ఆతృతతో ఉంటారు. తమ ఫేవరేట్ హీరో సినిమాకు సంబంధించి ప్రకటన వస్తే చాలు దానిపై ఎన్నో ఊహాగానాలు రచిస్తుంటారు. సినిమా ఇలా ఉండబోతుంది.. ఏ రేంజ్లో ఉంటుంది అంటు అంచనాలు వేస్తుంటారు. అయితే ప్రకటన వచ్చి చాలాకాలం అయినప్పటికీ.. సినిమా నుంచి సరైన అప్డేట్ రాకపోవడం వారికి కాస్తేంటి చాలానే నిరాశపరుస్తుంది. సరిగ్గా ఇదే విషయం సూపర్స్టార్ అభిమానుల విషయంలో జరిగింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత మహేష్ని వెండితెరపై అభిమానులు చూడలేదు. ఈ సినిమా తర్వాత ఆయన ‘గీతగోవిందం’ ఫేమ్ దర్శకుడు డైరెక్షన్లో ‘సర్కారు వారి పాట’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రకటన వచ్చి చాలాకాలమే అయింది. అయితే కనీసం మహేష్ ముఖం పూర్తిగా కూడా చూపించకుండా ఫస్ట్లుక్ పోస్టర్లు వదిలింది చిత్ర యూనిట్. దీంతో మహేష్ అభిమానులు ఆగ్రహంలో మునిగిపోయారు. తమ హీరో సినిమా అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని వాళ్లు ఎంతో ఆకలిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆ తరుణం రానే వచ్చింది. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా నుంచి అప్డేట్స్ వస్తాయని చిత్ర యూనిట్ ప్రకటించింది. అన్నట్లుగానే.. చిత్ర యూనిట్ శనివారం సాయంత్రం మహేష్ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమా నుంచి మహేష్ ఫస్ట్లుక్ని అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫస్ట్లుక్లో మహేష్ కారులోంచి దిగుకుంటూ మంచి క్లాస్ లుక్లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ని సూపర్స్టార్ మహేశ్ బాబు అధికారికంగా ట్వీట్ చేశారు. ఈ యాక్షన్ మరియు వినోదాన్ని ఈ సంక్రాంతికి మీ అందరితో పంచుకుంటాను అంటూ ఆయన పేర్కొన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్పై రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
from https://ift.tt/3rX1G01
No comments:
Post a Comment