దర్శకధీరుడు ఎస్ఎస్ సక్సెస్కి కేరాఫ్ అడ్రస్.. ఇప్పటివరకూ ఒక ఫ్లాప్ కూడా చూడని డైరెక్టర్. బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా కీర్తిని ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేశాడు ఆయన. ఇఫ్పుడు ‘ఆర్ఆర్ఆర్’ పేరుతో మరో భారీ ప్రాజెక్టును రూపొందిస్తున్నాడు జక్కన్న. అయితే ప్రతీ విషయంలో టాప్లో నిలిచే రాజమౌళి.. ఒక విషయంలో మాత్రం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుని బీట్ చేయలేకపోతున్నాడట. తొలి చిత్రం భద్రతో బ్లాక్బస్టర్ అందుకున్న దర్శకుడు . ఆ తర్వాత సింహా, లెజెండ్ తదితర చిత్రాలతో మాస్ డైరక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. గత కొంతకాలంగా సక్సెస్కి దూరమైన బోయపాటి.. నందమూరి బాలకృష్ణతో మరో చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ విశేష ఆదరణ పొందింది. త్వరలో ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అసలు విషయానికొస్తే.. అల్లు అర్జున్ హీరోగా బోయపాటి తెరకెక్కించిన ‘సరైనోడు’, సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన ‘జయ జానకి నాయక’ సినిమాలు నార్త్ ఇండియా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా హిందీ వర్షన్లు ఇప్పటికే 300 మిలియన్ల వ్యూస్ సాధించి.. దూసుకుపోతున్నాయి. ఈ రెండు సినిమాల్లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ కావడం మరో విశేషం. అయితే ఒకే డైరక్టర్ తెరకెక్కించిన రెండు సినిమాలు 300 మిలయన్లకు పైగా వ్యూస్ సాధించడం ఇదే తొలిసారి. ఈ రికార్డును బోయపాటి తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో రాజమౌళినే కాదు దేశవ్యాప్తంగా ఏ డైరక్టర్ సాధించలేని ఘనత సాధించి అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు బోయపాటి.
from https://ift.tt/3da83aj
No comments:
Post a Comment