‘సర్కారు వారి పాట’ రెండో షెడ్యూల్ ప్రారంభం.. పూర్తి నిబంధనలతో జాగ్రత్తగా షూటింగ్.. జాయినైన మహేశ్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Tuesday 13 April 2021

‘సర్కారు వారి పాట’ రెండో షెడ్యూల్ ప్రారంభం.. పూర్తి నిబంధనలతో జాగ్రత్తగా షూటింగ్.. జాయినైన మహేశ్

గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న సూపర్‌స్టార్ .. ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో ‘’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్లు సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ని దుబాయ్‌లో షూట్ చేశారు. అయితే ఆ తర్వాత కరోనా వ్యాప్తి కారణంగా రెండో షెడ్యూల్ షూటింగ్‌ను వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. తాజాగా మంగళవారం ఈ సినిమా రెండో షెడ్యూల్‌ షూటింగ్‌ని ప్రారంభించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. పూర్తిస్థాయిలో కరోనా నిబంధనలు పాటిస్తూ.. షూటింగ్ నిర్వహిస్తున్నామని స్పష్టం చేసింది. ఈ షూటింగ్‌లో మహేశ్ కూడా పాల్గొన్నారని ప్రకటించింది. ఇక ఈ షెడ్యూల్ పూర్తైన తర్వాత మరో మేజర్ షెడ్యూల్‌ని యూరోప్‌లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కరోనా పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే ఈ షెడ్యూల్ షూటింగ్‌కి యూరోప్ వెళ్తామని.. లేని పరిస్థితుల్లో ఈ షెడ్యూల్‌ని వాయిదా వేస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది. ఇక ఈ సినిమాలో మహేశ్ సరసన హీరోయిన్‌గా మహానటి నటిస్తుంది. రెండో షెడ్యూల్ షూటింగ్‌లో మహేశ్‌తో పాటు కీర్తి కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థమన్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నాడు. ఇప్పటికే ‘సర్కారు వారి పాట’ కోసం మూడు పాటలు కంపోజ్ చేసినట్లు థమన్ ‘వకీల్‌సాబ్’ సినిమాల ప్రమోషన్ సమయంలో వెల్లడించాడు. ఈ సినిమా 2022లో ప్రేక్షకుల ముందుకు రానుంది.


from https://ift.tt/3dfg5yG

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages