గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బ్లాక్బస్టర్ అందుకున్న సూపర్స్టార్ .. ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో ‘’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్లుక్ పోస్టర్లు సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. ఈ సినిమా తొలి షెడ్యూల్ని దుబాయ్లో షూట్ చేశారు. అయితే ఆ తర్వాత కరోనా వ్యాప్తి కారణంగా రెండో షెడ్యూల్ షూటింగ్ను వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. తాజాగా మంగళవారం ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ని ప్రారంభించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. పూర్తిస్థాయిలో కరోనా నిబంధనలు పాటిస్తూ.. షూటింగ్ నిర్వహిస్తున్నామని స్పష్టం చేసింది. ఈ షూటింగ్లో మహేశ్ కూడా పాల్గొన్నారని ప్రకటించింది. ఇక ఈ షెడ్యూల్ పూర్తైన తర్వాత మరో మేజర్ షెడ్యూల్ని యూరోప్లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కరోనా పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే ఈ షెడ్యూల్ షూటింగ్కి యూరోప్ వెళ్తామని.. లేని పరిస్థితుల్లో ఈ షెడ్యూల్ని వాయిదా వేస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది. ఇక ఈ సినిమాలో మహేశ్ సరసన హీరోయిన్గా మహానటి నటిస్తుంది. రెండో షెడ్యూల్ షూటింగ్లో మహేశ్తో పాటు కీర్తి కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ సంస్థలు భారీ బడ్జెట్తో ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థమన్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నాడు. ఇప్పటికే ‘సర్కారు వారి పాట’ కోసం మూడు పాటలు కంపోజ్ చేసినట్లు థమన్ ‘వకీల్సాబ్’ సినిమాల ప్రమోషన్ సమయంలో వెల్లడించాడు. ఈ సినిమా 2022లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
from https://ift.tt/3dfg5yG
No comments:
Post a Comment