తమిళంలో సూపర్ హిట్ సాధించిన ‘రాట్ససన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయ్యాడు హీరో . గత కొంతకాలంగా విశాల్ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలాతో చాలాకాలంగా డేటింగ్లో ఉన్నాడు. త్వరలోనే వీరిద్దరి వివాహ బంధంతో ఒక్కటవుతున్నట్లు సోషల్మీడియా ద్వారా ప్రకటించారు. విశాల్ తన మొదటి భార్య, దర్శకురాలు రాజినీ నటరాజ్ను 2010లో చేసుకున్నాడు. అయితే వ్యక్తిగత విబేధాల కారణంగా వీరిద్దరు 2018లో విడిపోయారు. వీరిద్దరికి ఆర్యన్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. మరోవైపు జ్వాలా కూడా 2005లో చేతన్ ఆనంద్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అతను కూడా బ్యాడ్మింటన్ క్రీడాకారుడే. అయితే వీరిద్దరు 2011లో విడిపోయారు. ఆ తర్వాత తన సోదరి పెళ్లి వేడుకల్లో గుత్తా జ్వాలాను కలిసిన విశాల్.. ఆమెతో ప్రేమలో పడ్డాడు. గత ఏడాది సెప్టెంబర్లో వీరిద్దరు గుట్టుచప్పుడు కాకుండా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. అయితే త్వరలోనే తమ వివాహం జరుగనుందని విశాల్ సోషల్మీడియా వేదికగా మంగళవారం ప్రకటించాడు. ఈ నెల 22వ తేదీన కుటుంబసభ్యులు, మిత్రుల సమక్షంలో తమ వివాహం జరుగనుందని అతను పేర్కొన్నాడు. ‘జీవితం ఒక ప్రయాణమని.. నమ్మకంతో ముందుకు సాగాలి’ అంటూ తమ వివాహ పత్రికను షేర్ చేశాడు అతను. అయితే కరోనా విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో తమ వివాహానికి ఎక్కువ మందిని ఆహ్వానించడం లేదని స్పష్టం చేశాడు. రానా దగ్గుబాటి హీరోగా నటించిన ‘అరణ్య’ చిత్రంలో విష్ణు విశాల్ ఓ కీలక పాత్రలో నటించాడు. ప్రస్తుతం అతను ఎఫ్ఐఆర్, మోహన్దాస్, ఇంద్రు నేత్రు నాలై 2 సినిమాల్లో నటిస్తున్నాడు.
from https://ift.tt/2QivFke
No comments:
Post a Comment