రాజకీయాల కోసం సినిమాలకు దూరమైన పవర్స్టార్ .. తాజాగా ‘వకీల్సాబ్’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించారు. హిందీలో బ్లాక్బస్టర్ హిట్ సాధించిన ‘పింక్’ రీమేక్గా ఈ సినిమాని రూపొందించారు. వేణు శ్రీ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మించారు. ఏప్రిల్ 9న విడుదలన ఈ చిత్రం బ్లాక్బస్టర్ టాక్ సొంతం చేసుకొని థియేటర్లలో దూసుకుపోతుంది. అయితే సినిమా విడుదల కంటే ముందే.. సినిమాకి థమన్ అందించిన మ్యూజిక్ సూపర్ హిట్గా నిలిచింది. ముఖ్యంగా గత ఏడాది అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ‘మగువా.. మగువా’ పాటకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇక సినిమా ప్రమెషన్లో భాగంగా సెకండాఫ్లో ఓ సర్ప్రైజ్ ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించారు. అన్నట్లుగానే సినిమా రెండో భాగంలో ‘మగువా.. మగువా’ పాట.. ఫీమేల్ వర్షన్ని సినిమాలో ఉంచారు. తాజాగా ఈ పాట లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. మోహన భోగరాజు పాడారు. ‘ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరూ’ అంటూ మహిళలు ఈ సమాజంలో ఎదురుకుంటున్న కష్టాలను కళ్లకు కట్టినట్లుగా ఈ పాటలో చూపించారు. ‘తీరదు నీ శోకం.. మారదు ఈలోకం.. తరములు ఎన్నైనా నీ కథ ఇంతేనా’ వంటి వాఖ్యాలతో పాట గుండెలను పిండేసేలా ఉంది. ప్రస్తుతం ఈ పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటించగా.. నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాశ్ రాజ్లు కీలక పాత్రల్లో నటించారు.
from https://ift.tt/3tnZQ82
No comments:
Post a Comment