కిడ్నీ సమస్య.. 35 ఏళ్లకే కన్నుమూసిన ప్రముఖ టీవీ నటి - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Sunday, 22 November 2020

కిడ్నీ సమస్య.. 35 ఏళ్లకే కన్నుమూసిన ప్రముఖ టీవీ నటి

‘సేత్ జి’, ‘ఆప్ కే ఆ జానే సే’, ‘మేరి హానికారక్ బివి’ వంటి ఎన్నో పాపులర్ హిందీ టీవీ సీరియల్స్‌లో నటించిన ప్రముఖ నటి లీనా ఆచార్య శనివారం (నవంబర్ 21)న ఢిల్లీలో కన్నుమూశారు. కిడ్నీలో సమస్య కారణంగా ఆమె మరణించారు. లీనా ఆచార్య మృతిచెందిన విషయాన్ని ఆమెతో కలిసి ‘సేత్ జి’లో నటించిన వర్షిప్ ఖన్నా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘‘గడిచిన ఏడాదిన్నర కాలంగా లీనా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. కొన్ని రోజుల క్రితమే లీనా తల్లి ఆమెకు కిడ్నీ దానం చేశారు. అయినప్పటికీ ఆమెను ప్రాణాలను కాపాడలేకపోయారు’’ అని వర్షిప్ ఖన్నా పేర్కొన్నారు. నిజానికి, లీనా ఆచార్య కొవిడ్-19తో చనిపోయారని మొదట రూమర్లు వచ్చాయి. కానీ, ఆమె మరణానికి కారణం కిడ్నీ సమస్య అని వర్షిప్ ఖన్నా స్పష్టం చేశారు. అంతేకాదు, ఆమెతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ‘‘2015లో లీనాతో కలిసి పనిచేసే అవకాశం నాకు దక్కింది. ‘సేత్ జి’ సీరియల్‌లో ఆమె నాకు తల్లిగా నటించారు. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ముంబైలో బ్యాచిలర్‌గా ఉండే నాకు ఆమె భోజనం తీసుకొచ్చేవారు. ఆమె చాలా సరదాగా, ప్రేమగా ఉండే వ్యక్తి’’ అని ఈటైమ్స్ టీవీతో మాట్లాడుతూ వర్షిప్ ఖన్నా భావోద్వేగానికి గురయ్యారు. Also Read: అలాగే లీనా ఆరోగ్య సమస్యల గురించి వర్షిప్ మాట్లాడారు. ‘‘2015లో ఆమెకు ఆరోగ్య సమస్య తలెత్తిందని నాకు తెలిసింది. ఆమెకు ఒక కిడ్నీని తొలగించారు. ఆ తరవాత ఆమె పలు ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు. గడిచిన నాలుగు నెలలుగా ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆమె అనుభవం కలిగిన నటి. ఆమెను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను’’ అని వర్షిప్ చెప్పారు. లీనా వయసు అటుఇటుగా 30 ఏళ్లు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆమె చిన్న వయసులోనే కన్నుమూయడం టీవీ పరిశ్రమను కలచివేస్తోంది. కాగా, లీనా గతంలో ‘హిచ్కి’ అనే సినిమాలో, పలు వెబ్ సిరీస్‌లలో నటించారు.


from https://ift.tt/2HoH3GZ

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages