నా మంచం మీద ఎప్పుడూ ముగ్గురు మగాళ్లు.. ఆ హీరో టచ్ మరువలేను.. సీనియర్ హీరోయిన్ బోల్డ్ కామెంట్స్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday 17 August 2020

నా మంచం మీద ఎప్పుడూ ముగ్గురు మగాళ్లు.. ఆ హీరో టచ్ మరువలేను.. సీనియర్ హీరోయిన్ బోల్డ్ కామెంట్స్

అబ్బో.. మాములుగా లేదండీ సీనియర్ వ్యవహారం. అటు నాగార్జున టచ్ మరచిపోలేను అంటూనే ఇటు యంగ్ హీరో విజయ్ దేవరకొండ అంటే చాలా క్రష్ అంటూ తెగ సిగ్గుపడిపోతోంది. అంతేకాదండోయ్ ఇప్పుడైనా, ఎప్పుడైనా క్రికెటర్ ధోని అంటే ఎంతో ఇష్టమని చెబుతూ ఓపెన్ అయింది. ఆలీతో సరదాగా ప్రోగ్రామ్‌లో పాల్గొన్న ఆమె తన జీవిత విశేషాలతో పాటు ఇష్టాయిష్టాలు తెలుపుతూ రచ్చ రచ్చ చేసింది. దీంతో ‌ఇటీవలే విడుదలైన ఈ ప్రోగ్రామ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషా చిత్రాల్లో నటించి ఎంతోమంది మనసు దోచేసిన సీనియర్ హీరోయిన్ తనకు మాత్రం నాగార్జున అంటేనే ఇష్టమని చెప్పింది. ఆయనతో కలిసి 'అన్నమయ్య' సినిమాలో నటించిన ఆమె.. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఓ రోజు నాగార్జున షేక్ హ్యాండ్ ఇవ్వడంతో ఆ చేయిని అలాగే చూస్తూ పడుకున్నానని చెప్పింది. అంతేకాదు తాను ఎందరో హీరోలతో కలిసి పని చేశాను గానీ లైఫ్ టైమ్‌లో క్రష్ అంటూ ఒకటి వచ్చిందంటే అది నాగార్జున గారి మీదే అంటూ సీక్రెట్స్ బయటపెట్టింది కస్తూరి. Also Read: ఇక ఈ కార్యక్రమంలో భాగంగా.. జీవితంలో ముగ్గురు మగాళ్లకు నిద్రపోతున్నపుడు ఫోన్ చేస్తారా? అని అలీ ఓ ప్రశ్న వేస్తుండగా, మధ్యలోనే ఎంటరై ఈ విషయాన్ని ఇలా కూడా చెప్పొచ్చంటూ బోల్డ్ కామెంట్ చేసింది హీరోయిన్ కస్తూరి. ''నా మంచం మీద ఎప్పుడూ ముగ్గురు మగాళ్లు'' అనేసింది. దీంతో అది విన్న అలీ ఒక్కసారిగా షాకయ్యాడు. అంతటితోనే ఆ స్టోరీని ఎండ్ చేసి ప్రోమో కొనసాగించారు. కాగా.. చాలా సినిమాల్లో తనను తల్లి పాత్రలో తీసుకొని తీరా కెమెరా ముందుకు పోయాక తీసేశారని కస్తూరి చెప్పుకొచ్చింది. అయితే అందుకు కారణం తాను యంగ్ లుక్‌లో కనిపించడమే అని చెబుతూ మెలికలు తిరిగిపోయింది. ఆ తర్వాత రమ్యకృష్ణ అంటే తనకు ఎంతో ఇష్టమని, అలాగే ఒకవేళ అవకాశం వస్తే విజయ్ దేవరకొండ లవర్‌గా అయితే నటిస్తా కానీ తల్లిగా నటించనని చెబుతూ ఆశ్చర్యపర్చింది కస్తూరి. ఇక చివరగా.. తనపై గత సంవత్సర కాలంగా వస్తున్న సైబర్ అబ్యూస్‌లకు పదునైన సమాధానం ఇవ్వాలని ఓ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశానని కస్తూరి చెప్పడం గమనార్హం. ఆ ఛానల్ ద్వారానే తగిన సమాధానం ఇవ్వబోతున్నాని తెలిపింది. అలాగే తన భర్త, మ్యారేజ్ లైఫ్ గురించి కూడా ప్రస్తావించింది. ప్రోమోనే ఇలా ఉందంటే ఇక ఫుల్ ఎపిసోడ్‌లో కస్తూరి ఇంకెన్ని సీక్రెట్స్ చూస్తామో!.


from https://ift.tt/3h50Ho6

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages