తమ్ముడితో రకుల్ పులుసాట.. వాయగొట్టాడు! - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday 4 May 2020

తమ్ముడితో రకుల్ పులుసాట.. వాయగొట్టాడు!

కరోనా వైరస్‌ను అరికట్టడానికి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తుండటం వల్ల సామాన్య ప్రజలతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో వారు సరదాగా గడుపుతున్నారు. ఇన్నిరోజులూ వెండితెరపై సందడి చేసిన హీరోయిన్లు ఇప్పుడు ఇళ్లలో వంటలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే పిల్లో, పేపర్ ఛాలెంజ్‌లను సరదాగా చేసి చూపిస్తున్నారు. ఈ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. లాక్‌డౌన్ సమయంలోనూ తమ అభిమానులకు వినోదాన్ని పంచుతున్నారు. తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. చాలా సరదాగా ఉంది. తన తమ్ముడు అమన్‌తో కలిసి చిన్ననాటి చిలిపి ఆటలన్నింటినీ ఆడేశారు రకుల్. ఇంట్లోనే ఒక గదిలో తమ్ముడితో కలిసి డాగ్ అండ్ బోన్, కబడ్డీ, చిదియా ఉధ్ (పులుసాట) ఆటలు ఆడారు. రెండు ఆటల్లో గెలిచిన రకుల్.. పులసాటలో మాత్రం తమ్ముడికి దొరికిపోయారు. రకుల్ పులుసు పోస్తుంటే అమన్ ఆమె చేతులను వాయించారు. రకుల్ మండపై అమన్ పెళ్లుమని కొట్టగానే.. ఆమె నెప్పి తట్టుకోలేక కోపంతో తమ్ముడిని కాలితో తన్నారు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం హిందీలో వరుసగా సినిమాలు చేస్తోన్న రకుల్.. తన మకాంను టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి మార్చారు. తెలుగులో ‘కెరటం’ సినిమాతో పరిచయమైన రకుల్.. ఆ తరవాత ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక అక్కడి నుంచి వరుస సినిమాలతో దూసుకుపోయారు. స్టార్ హీరోల సరసన నటించి టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఎదిగారు. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగార్జున, రవితేజ, గోపీచంద్, రామ్.. ఇలా చాలా మంది స్టార్ హీరోలతో ఆమె నటించారు. రకుల్ తెలుగులో ఆఖరిగా చేసిన సినిమా ‘మన్మథుడు 2’.


from https://ift.tt/2YwVfEb

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages