టాలీవుడ్ బ్యాచిలర్ హీరోల పెళ్లి ముచ్చటంటే ప్రేక్షకులకు అదో సంబరం. ఈ ఏడాది యంగ్ హీరోలు నితిన్, నిఖిల్ పెళ్ళికి ముహుర్తాలు కూడా పెట్టేసుకొని లాక్డౌన్ కారణంగా తమ పెళ్లి వాయిదా వేసుకున్నారు. ఈ లాక్డౌన్ ఫినిష్ కాగానే ఆ ఇద్దరూ పెళ్లిపీటలెక్కనున్నారు. అయితే వాళ్ళతో పాటు ఈ ఏడాదే మరో యంగ్, మెగా మేనల్లుడు హీరో కూడా పెళ్లి చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పడంతో మెగా కాంపౌండ్లో బ్యాండ్ బాజా వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. లాక్డౌన్ నేపథ్యంలో షూటింగ్స్ అన్నీ ముగించుకొని ఇంటికే పరిమితమైన మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్.. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లి సంగతులపై రియాక్ట్ అయ్యారు. ఆయన చెప్పిన మాటలు వింటుంటే ఈ ఏడాది మెగా వారింట పెళ్లి బాజాలు ఖాయం అని తెలుస్తోంది. ఇప్పటికే 33 ఏళ్లు వచ్చేశాయని, పెళ్లి చేసుకోమని ఇంట్లో అందరూ గొడవ చేస్తున్నారని సాయిధరమ్ తేజ్ చెప్పారు. మనం పెళ్లి గురించి ఎంత దూరం జరుగుదామని అనుకున్నా ఇంట్లో వాళ్లు ఆ విషయాన్ని పదే పదే గుర్తు చేస్తున్నారని, వాళ్ళ తొందర చూస్తుంటే ఈ ఏడాది పెళ్లి జరుగుతుందేమో! అనిపిస్తోందని ఆయన అన్నారు. ఇక మెగా హీరోలంతా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు కదా! మరి మీ పరిస్థితేంటి? అనే ప్రశ్నకు బదులిచ్చిన సాయి తేజ్.. అదృష్టం కలిసి వచ్చి తాను కూడా ఈ యేడాది లవ్లో పడొచ్చేమో అంటూ ప్రేమపై తన స్పందన తెలిపారు. ఇదంతా చూస్తుంటే ఈ మెగా మేనల్లుడు శుభవార్త చెప్పే రోజు దగ్గరలోనే ఉందని అనిపిస్తోంది. Also Read: ఇటీవలే 'ప్రతిరోజు పండగే' సినిమాతో సక్సెస్ అందుకున్న సాయి ధరమ్ తేజ్.. తన తదుపరి సినిమా 'సోలో బ్రతుకే సో బెటర్' కూడా ఫినిష్ చేశారు. కొత్త దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 1వ తేదీన విడుదల కావాల్సి ఉండగా కరోనా ఎఫెక్ట్ వల్ల వాయిదా పడింది. థియేటర్స్ రీ ఓపెన్ కాగానే చిగిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
from https://ift.tt/35rO01w
No comments:
Post a Comment