సినీకార్మికులు, డబ్బింగ్ యూనియన్‌కు సాయికుమార్ విరాళం - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Wednesday, 8 April 2020

సినీకార్మికులు, డబ్బింగ్ యూనియన్‌కు సాయికుమార్ విరాళం

మెగాస్టార్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఏర్పడిన కరోనా క్రైసెస్ ఛారిటీ (సీసీసీ) ‘మనకోసం’కు హీరో సాయికుమార్, ఆయన తనయుడు హీరో ఆది కలిసి ఐదు లక్షల నాలుగు రూపాయలను అందజేశారు. సినీ కార్మికుల సంక్షేమం కోసం విరాళంగా ఈ మొత్తాన్ని ఆర్‌.టి.జి.ఎస్ ద్వారా బుధవారం ఉదయం సీసీసీకి పంపించారు. అలాగే డబ్బింగ్ యూనియన్ అసోసియేషన్‌కు కూడా సాయికుమార్ తనవంతుగా ఒక లక్ష ఎనిమిది రూపాయలు, సాయికుమార్ సోదరుడు రవిశంకర్ ఒక లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు. కరోనా మహమ్మారిని నిర్మూలించడానికి దేశంలో 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సినిమా షూటింగ్‌లను కూడా ఆపేశారు. దీంతో సినీ పరిశ్రమలో రోజువారీ వేతనానికి పనిచేసే కార్మికులు ఉపాధి కోల్పోయారు. వారిని ఆదుకోవడం కోసం సినీ పరిశ్రమ పెద్దలందరూ కలిసి కరోనా క్రైసిస్ ఛారిటీని ఏర్పాటుచేశారు. చిరంజీవి ఫౌండేషన్‌లో భాగంగా దీన్ని ఏర్పాటుచేసి మెగాస్టార్‌ను చైర్మన్‌గా నియమించారు. దీనికి మొదటిగా చిరంజీవి కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఆ తరవాత నాగార్జున కూడా కోటి రూపాయలు అందజేశారు. Also Read: ఇక అక్కడి నుంచి స్టార్ హీరోలందరూ వరసపెట్టి విరాళాలు అందించారు. మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, నాగచైతన్య.. ఇలా చాలా మంది హీరోలు, నిర్మాతలు, దర్శకులు విరాళాలను అందజేశారు. మొత్తం మీద ఈ ఛారిటీ ద్వారా ఏడు నుంచి ఎనిమిది కోట్ల రూపాయలను సేకరించారు. ఈ డబ్బుతో లాక్‌డౌన్ సమయంలో సినీ కార్మికుల కుటుంబాలకు నిత్యావసరాలను అందజేయనున్నారు. ఇప్పటికే వారికి నిత్యావసరాల పంపిణీని మొదలుపెట్టారు. ప్రభుత్వంపై ఆధారపడకుండా ఇండస్ట్రీకి చెందిన కార్మికులను ఆదుకుంటూ సినీ ప్రముఖులు తమ పెద్ద మనసులను చాటుకుంటున్నారు.


from https://ift.tt/2xcLiAo

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages