సినీ కార్మికుల కోసం కాజల్.. ముందుకొచ్చిన చందమామ.. ఎంతిచ్చిందో తెలుసా? - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Thursday, 16 April 2020

సినీ కార్మికుల కోసం కాజల్.. ముందుకొచ్చిన చందమామ.. ఎంతిచ్చిందో తెలుసా?

చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా భారత దేశాన్నీ కాటేసింది. దేశంలో చొరబడి కంటికి కనిపించకుండా కరాళ నృత్యం చేస్తోంది. ఈ మహమ్మారిని అంతమొందించేందుకు లాక్‌డౌన్ ఒక్కటే సరైన మార్గమని భావించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశాయి. దీంతో పరిశ్రమలు, సినిమా షూటింగ్స్ వాయిదాపడి రోజు వారి కార్మికుల బ్రతుకు రోడ్డున పడింది. ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు గాను సినీ తారలు ముందుకొస్తున్నారు. తాజాగా సినీ కార్మికుల సహాయార్థం తన విరాళాన్ని ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వరంలో ఏర్పడిన 'సీసీసీ' (కరోనా క్రైసిస్ చారిటీ) మనకోసంకి రూ.2 లక్షల రూపాయల విరాళాన్ని అందించనున్నట్లు పేర్కొంది. ఆర్టీజీఎస్ ద్వారా సీసీసీకి ఆ డబ్బు పంపిస్తామని కాజల్ మేనేజర్ తెలిపాడు. ఇప్పటికే సీసీసీ మనకోసం సంస్థ కోసం పెద్దఎత్తున సినీ తారలు కదలి వచ్చారు. తీవ్ర ఇబ్బందులు తాము అండగా ఉంటామని ఉదారత చాటుకున్నారు. సీఎం, పీఎం సహాయక నిధులకు విరాళాలు అందిస్తూనే సీసీసీకి ప్రత్యేకంగా విరాళాలు ఇచ్చారు టాలీవుడ్ టాప్ హీరోలు. ఈ లిస్టులో ప్రభాస్, పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, లావణ్య త్రిపాఠి సహా ఎందరో సినీ ప్రముఖులు ఉన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో పేదల సహాయార్థం సినీ తారలు ఇస్తున్న సపోర్ట్ ఎంతో విలువైనదని పేర్కొంటూ అందరికీ కృతజ్ఞతలు చెప్పారు చిరంజీవి.


from https://ift.tt/2RFIGCf

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages