కరోనా కోసం కదిలివచ్చిన బాలీవుడ్ జంట.. విరాళం ప్రకటించిన దీప్‌వీర్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Saturday, 4 April 2020

కరోనా కోసం కదిలివచ్చిన బాలీవుడ్ జంట.. విరాళం ప్రకటించిన దీప్‌వీర్

కోసం ప్రధాని ఇచ్చిన పిలుపుతో పెద్ద ఎత్తున విరాళాలు వస్తున్నాయి. చిన్నారుల నుంచి సినీ తారల వరకు అంతా పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్, క్రికెట్ ప్లేయర్ తమవంతు సాయంగా విరాళాలు ప్రకటించారు. తాజాగా బాలీవుడ్ జంట దీపికా, రణ్‌వీర్ పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళం అందిస్తున్నట్లుగా తెలిపారు. ‘ఇలాంటి సమయంలో ప్రతి చిన్న సహాయం కూడా ఉపయోగపడుతుంది. పీఎం కేర్స్ ఫండ్‌కు తమ వంతు సాయం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మీరు కూడా చేస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు మనమంతా ఐకమత్యంగా ఉన్నాం. ఈ పరిస్థితి నుంచి తప్పకుండా బయటపడతాం. జైహింద్. ’ అని దీపిక రణ్‌వీర్ ట్వీట్ చేశారు. అయితే తాము ఎంత విరాళం ఇస్తున్నామనే విషయాన్ని మాత్రం ఈ హాట్ కఫుల్ బయటకు చెప్పలేదు. ఇప్పటికే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ రూ.25కోట్లు విరాళం ప్రకటించారు.విక్కీ కౌశల్ కోటి రూపాయలు అందించారు. హీరోయిన్ కంగనా రూ.25లక్షలు అందించారు. వీరితో పాటు కార్తిక్ ఆర్యన్, అజయ్ దేవగన్, కత్రినా కైఫ్, అలియా భట్, సారా అలీ ఖాన్, వరుణ్ ధావన్, అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా కూడా విరాళాలు ప్రకటించారు. పీఎం-కేర్స్ నిధికి విరాళాలు ఇవ్వడంతోపాటు కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న టాలీవుడ్, బాలీవుడ్ తారలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. భారతదేశపు తారలు దేశ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో సైతం కథనాయక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. పీఎం కేర్స్‌కు విరాళాలు ఇవ్వడంలో నాయకత్వ పాత్ర పోషిస్తున్నారన్నారు.


from https://ift.tt/2ywavWJ

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages