మే 3 తరవాత కరోనా ఆకాశంలోకి వెళ్తుందా.. పేదల సంగతేంటి: మోదీనే ప్రశ్నిస్తోన్న సమాజసేవకి! - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Tuesday, 14 April 2020

మే 3 తరవాత కరోనా ఆకాశంలోకి వెళ్తుందా.. పేదల సంగతేంటి: మోదీనే ప్రశ్నిస్తోన్న సమాజసేవకి!

కరోనా మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టేందుకు, దానిని నిర్మూలించేందుకు ప్రజలంతా 21 రోజులుగా ఇళ్లకే పరిమితమయ్యారు. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌గా స్ట్రిక్ట్‌గా అమలు చేశారు. అయితే, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పెరుగుతోన్న కరోనా పాజిటివ్ కేసుల దృష్ట్యా ఈ లాక్‌డౌన్‌ను మరో 19 రోజుల పాటు పెంచక తప్పదని సోమవారం జాతిని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు చెప్పారు. ఏప్రిల్ 20 నాటికి పరిస్థితి చక్కబడితే రెడ్ జోన్లు, హాట్‌స్పాట్లు మినహా మిగిలిన చోట్ల కాస్త వెసులుబాటు కల్పిస్తామని వెల్లడించారు. అయితే, ప్రధాన మంత్రి నిర్ణయం పట్ల వివాదాస్పద నటి శ్రీరెడ్డి అసహనం వ్యక్తం చేసింది. కరోనా కట్టడికి లాక్‌డౌన్ పరిష్కారం అయినప్పటికీ దీని వల్ల పేద ప్రజలు నష్టపోతున్నారని ఫేస్‌బుక్ ద్వారా వ్యాఖ్యలు చేసింది. ‘‘ఇండియాలో మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించాలని మోదీ సూచించారు. ఆరోగ్యంగా ఉండమని ప్రత్యక్షంగా చెబుతున్నారు. మేం పేదలకు ఎలాంటి సాయం చేయలేం.. అలాగే ఎకానమీ పడిపోతుందని పరోక్షంగా చెబుతున్నారు’’ అని శ్రీరెడ్డి మొదట ఒక పోస్ట్ పెట్టింది. ఆ తరవాత వరుసగా మరో రెండు పోస్టులను కాస్త వెటకారాన్ని జోడిస్తూ చేసింది. ‘‘మే 3 తరవాత కరోనా ఆకాశంలోకి లేదంటే ఇంకెక్కడికైనా వెళ్లిపోతుందా? పేదలను ఎలా కాపాడాలో ఆలోచించండి. వాళ్లు నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి కనీస డబ్బును అందజేయండి’’ అని ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొంది. అక్కడితో ఆగకుండా మరో పోస్ట్ కూడా చేసింది. ‘‘మే 3 తరవాత కరోనా సోకిన ఒక వ్యక్తి బయటికి వెళ్లి మళ్లీ కొన్ని లక్షల మందికి అంటిస్తాడు. అప్పుడు మళ్లీ ఏం చేస్తారు?’’ అని శ్రీరెడ్డి చాలా తెలివిగా ప్రశ్నించానని అనుకుంది. అయితే, ప్రధానికి ఇన్ని ప్రశ్నలు సంధించిన శ్రీరెడ్డి.. అసలు కరోనా కట్టడికి ఏంచేస్తే బాగుంటుందో చెప్పలేదు. పోనీ.. ఈ లాక్‌డౌన్ పీరియడ్‌లో పేద ప్రజలను ఎలా ఆదుకోవాలో సలహా ఇవ్వలేదు. అందుకే, కొంత మంది నెటిజన్లకు ఎక్కడో కాలింది. శ్రీరెడ్డిని చెడామడా వాయించడం మొదలుపెట్టారు. ‘‘పీఎం కేర్స్ ఫండ్‌కు నువ్వు ఎంత విరాళంగా ఇచ్చావో ముందు నాకు చెప్పు. ఎంతో మంది సెలబ్రిటీలు తమ వంతు సాయం అందిస్తున్నారు. పోనీ పీఎం కేర్స్‌ను పక్కనబెడదాం. నీ ప్రాంతంలో పేద ప్రజలకు నువ్వు ఏం చేశావ్. నీ చుట్టూ ఉన్న పేదలను నువ్వు అసలు గుర్తించావా? వాళ్లకు ఏమైనా సాయం చేశావా? ప్రభుత్వం తన విధి తాను నిర్వర్తిస్తోంది. నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించు’’ అని ఒక మహిళ కామెంట్ సెక్షన్‌లో గట్టిగా వాయించేశారు. ఈమె ఒక్కరు మాత్రమే కాదు.. చాలా మంది నెటిజన్లు శ్రీరెడ్డి వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. అంతేకాదు.. గతంలో ఆమె పోస్టులను ప్రస్తావిస్తూ అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వీలైతే సాయం చేయాలి. లేదంటే, అందరిలా లాక్‌డౌన్‌ను పాటించాలి. కానీ, ప్రభుత్వం తీసుకుంటోన్న ఇలాంటి ఉత్తమమైన నిర్ణయాలను విమర్శిస్తూ.. అందులోనూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఊరుకుంటారా? అసలే, సోషల్ మీడియాలో మోదీ అభిమానులు విపరీతంగా ఉన్నారు. వాళ్లంతా వాయించేయరూ! ఏంటి సమాజసేవకి.. కాస్త ఆలోచించాలి కదా..!! అని అంటున్నారు కొంత మంది నెటిజన్లు.


from https://ift.tt/3bah1ki

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages