స్నేహితుల రోజు సందర్భంగా నందమూరి అభిమానులకు డబుల్ ధమాకా అందింది. కొద్ది సేపటి క్రితం యంగ్ టైగర్ నటిస్తున్న RRR మూవీ నుంచి స్పెషల్ అప్డేట్ ఇస్తూ దోస్తీ సాంగ్ రిలీజ్ చేయగా.. తాజాగా బుల్లితెర ప్రోగ్రాం ప్రోమో రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. ఈ రెండు వీడియోల్లో ఎన్టీఆర్ లుక్ చూసి తెగ మురిసిపోతున్నారు నందమూరి ఫ్యాన్స్. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' పేరుతో స్టార్ మా ఛానల్లో ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న షోను ఇప్పుడు జెమినీ టీవీలో ప్రసారం చేయబోతున్నారు. దీనికి '' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా ఈ షో ప్రోమో వీడియో రిలీజ్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయింది. ఎన్టీఆర్ మాటల తూటాలు బుల్లితెర ఆడియన్స్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియోలో ''ఇక్కడ మనీతో పాటు మనసులు కూడా గెలుచుకోవచ్చు. ఇక్కడ కథ మీది, కల మీది.. ఆట నాది.. కోటి మీది.. రండి గెలుద్దాం.. ఎవరు మీలో కోటీశ్వరులు'' అంటూ మనసుకు హత్తుకునే మాటలతో ఆకర్షించారు హోస్ట్ తారక్. కరోనా సమయంలో ఏర్పడిన గడ్డు పరిస్థితులు చూపిస్తూ గుండె బరువెక్కేలా డిజైన్ చేసిన ఈ వీడియో జనాలను ఆలోచింపజేసేదిగా ఉంది. ఇందులో తారక్ మీసకట్టు లుక్ స్పెషల్ అట్రాక్షన్ అయింది. ఇకపోతే గతంలో బిగ్ బాస్ సీజన్- 1తో బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసిన తారక్.. మరోసారి ఇలా బుల్లితెర ఆడియన్స్ ముందుకు రానుండటం అందరిలోనూ ఆతృతను పెంచేసింది. ఈ నెల (ఆగస్టు) లోనే 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో ప్రారంభం కానుందని తెలిపారు. గత ప్రోమోతో పాటు ఈ ప్రోమో కూడా ఆకర్షించడంతో షోపై భారీ హైప్ క్రియేట్ అయింది.
from https://ift.tt/3lkmxZx
No comments:
Post a Comment