పూజా హెగ్డేపై రోజా భర్త సంచలన వ్యాఖ్యలు.. అప్పుడు ఇద్దరే ఇప్పుడు 12 మంది అంటూ షాకింగ్ కామెంట్స్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Wednesday, 18 August 2021

పూజా హెగ్డేపై రోజా భర్త సంచలన వ్యాఖ్యలు.. అప్పుడు ఇద్దరే ఇప్పుడు 12 మంది అంటూ షాకింగ్ కామెంట్స్

'ఒక లైలా కోసం' అంటూ తెలుగు తెరపై కాలుమోపిన యంగ్ హీరోయిన్ .. ప్రస్తుతం ఫుల్ బిజీగా మారింది. చేతినిండా సినిమాలతో క్షణం తీరికలేకుండా గడుపుతోంది. తెలుగు తెరపై రాణిస్తూనే బాలీవుడ్ ఆఫర్స్ పట్టేస్తూ జోష్ కంటిన్యూ చేస్తోంది. ఈ పరిస్థితుల నడుమ పూజా హెగ్డేపై రోజా భర్త, తమిళ సినీ ఫెడరేషన్ యూనియన్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు చేశారంటూ వస్తున్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్స్ విషయమై పూజా వ్యవహరిస్తున్న తీరు ప్రొడక్షన్ ఖర్చు పెంచేయడమే గాక నిర్మాతలకు భారంగా మారుతోందంటూ ఆర్కే సెల్వమణి ఓ మీడియా సమావేశంలో చెప్పినట్లు సమాచారం. కెరీర్ మొదట్లో షూటింగ్ లొకేషన్‌కి వచ్చే సమయంలో తనవెంట ఒకరు లేదా ఇద్దరిని మాత్రమే తీసుకొచ్చే పూజా హెగ్డే.. ఇప్పుడు 12 మందిని వెంటబెట్టుకొని షూటింగ్ లొకేషన్‌కి వస్తోందని ఆయన అన్నారట. షూటింగ్ కోసం రావడానికి ఆమె చుట్టూ అంతమంది ఉండాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ ఖర్చు కూడా నిర్మాతలపై పడి భారంగా మారుతోందని, ఇలా నిర్మాత డబ్బులు వృధా చేయడం సరికాదని ఆయన చెప్పినట్లు బయటకొచ్చిన న్యూస్ సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. మరోవైపు చూస్తే.. సౌత్ ఇండియాలో పూజా హెగ్డేకి మార్కెట్ బాగా పెరిగింది. స్టార్ హీరోల సినిమాల్లో బెటర్ ఛాయిస్‌గా పూజానే లెక్కలోకి తీసుకుంటున్నారు దర్శకనిర్మాతలు. దీంతో ఆమె రెమ్యునరేషన్ 5 కోట్లకు పెంచేసింది. ప్రస్తుతం ప్రభాస్ సరసన 'రాధేశ్యామ్' మూవీ చేస్తున్న పూజా.. అక్కినేని అఖిల్‌తో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా కంప్లీట్ చేసేసింది. విజయ్ సరసన తమిళంలో ఓ సినిమా చేస్తోంది. అలాగే మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న కొత్త సినిమాలోనూ నటించబోతోంది.


from https://ift.tt/3gbsBk2

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages