Dosti ఇప్పుడు ఎక్కడ చూసినా హాట్ టాపిక్ అయింది. దర్శకధీరుడు రాజమౌళి స్ట్రాటజీని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. ఏది చేసినా కూడా పక్కా ప్రణాళికతో చేస్తారు. జనాల్లోకి రీచ్ అయ్యే విధంగానే చేస్తుంటారు. అలా ఇప్పుడు RRR నుంచి ఫస్ట్ సాంగ్ను విడుదల చేసి ట్రెండ్ అవ్వాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే అంటూ ప్రమోషనల్ సాంగ్ కోసం ఐదు భాషల నుంచి ఐదు గురు సింగర్లను రంగంలోకి దించారు. ఆగస్ట్ ఒకటో తారీఖున రాబోతోన్న ఈ దోస్తీ మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సారథ్యంలో ఐదు గురు సింగర్లు హేమచంద్ర, అనిరుధ్, అమిత్ త్రివేది, విజయ్ జేసుదాస్, యాజిన్ నిజర్ పాడబోతోన్న ఈ పాటపై అంచనాలు ఆకాశన్నంటుతున్నాయి. ఈ మేరకు వదిలిన ఫోటో నెట్టింట్లో ఓ రేంజ్లో వైరల్ కాసాగింది. పాడటం ఒకెత్తు అయితే ప్రమోషన్ షూట్లో ఉండటం మరో ఎత్తు అని అన్నారు. ఈ మేరకు హేమచంద్ర మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ‘కీరవాణి, రాజమౌళి గార్లతో పని చేయడం ఇది మొదటిసారి. ఇది కచ్చితంగా నా కల నెరవేరిన రోజు. ఇది గొప్ప అదృష్టం. ఈ పాట ఎలా వచ్చింది?.. ఎంత గొప్పగా వచ్చింది అనేది మాటల్లో చెప్పలేకపోతోన్నాను. సాంగ్ షూట్ అయితే వేరే లెవెల్. ప్రతీ పాట పాడేటప్పుడు ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి భారీ ప్రాజెక్ట్లో పాడటం ఇంకా ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. అంతే కాకుండా ప్రమోషన్ సాంగ్లో ఉండటం, అది వచ్చిన తీరు మైండ్ బ్లోయింగ్. ఇక సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రతీ లైన్ సూపర్గా ఉంది.ఓవరాల్ ప్యాకేజ్ ఇది’ అని హేమచంద్ర అంచనాలు పెంచేశారు.
from https://ift.tt/3j2RX3Q
No comments:
Post a Comment