Chiranjeevi: 'ఆచార్య' తర్వాత మెగా స్టెప్.. ముహూర్తం ఫిక్స్! భారీగా ప్లాన్ చేస్తున్న టీమ్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday 26 July 2021

Chiranjeevi: 'ఆచార్య' తర్వాత మెగా స్టెప్.. ముహూర్తం ఫిక్స్! భారీగా ప్లాన్ చేస్తున్న టీమ్

సినిమాల్లోకి రీ- ఎంట్రీ ఇచ్చాక సెలక్టెడ్ మూవీస్ ఎంచుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. 'సైరా నరసింహా రెడ్డి' తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఆయన.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆచార్య' మూవీ ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీకి సంబంధించి అతి త్వరలో మిగిలిన భాగం కూడా ఫినిష్ చేసేలా ప్లాన్ చేశారు మేకర్స్. ఈ నేపథ్యంలో 'ఆచార్య' తర్వాత మెగాస్టార్ చేయబోతున్న 'లూసిఫర్' రీమేక్‌ షూటింగ్ అప్‌డేట్ బయటకొచ్చింది. చిరంజీవి 153వ సినిమాగా 'లూసిఫర్' రీమేక్‌ రూపొందనుంది. మలయాళ సూపర్ హిట్ సినిమా 'లూసిఫర్'కు తెలుగు రీమేక్‌గా రాబోతున్న ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించనుండగా శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ ఫినిష్ చేసిన చిత్రయూనిట్ రెగ్యులర్ షూటింగ్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రాబోతున్న ఈ చిత్రాన్ని వచ్చే నెల (ఆగస్టు) 12 నుంచి సెట్స్ పైకి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. ఇందుకోసం ప్రొడక్షన్‌ డిజైనర్‌ సురేష్‌ సెల్వరాజన్‌ నేతృత్వంలో ఓ భారీ సెట్‌ రూపొందిస్తున్నారు. తొలి షెడ్యూల్ మేజర్ పార్ట్ ఈ భారీ సెట్ పైనే చిత్రీకరించనున్నారట. ఒరిజినల్ వర్షన్‌లో మంజు వారియర్ పోషించిన పాత్ర కోసం నయనతారను తీసుకోవాలని చూస్తున్నారట. అతిత్వరలో చిత్ర నటీనటుల పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.


from https://ift.tt/3eUXfNP

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages