‘స్వయంవరం’, ‘చెప్పవే చిరుగాలి’, ‘కళ్యాణరాముడు’ తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులతో నవ్వులు పూయించిన నటుడు . అటు కామెడీ హీరోగానే ప్రేక్షకులను అలరిస్తూ.. మరోవైపు ఎమోషనల్ సీన్స్ చేయడంలోనూ వేణు తనదైన స్టైల్ గుర్తింపు తెచ్చుకున్నారు. తొలి సినిమా ‘స్వయంవరం’తోనే నంది అవార్డు అందుకున్న గత కొంతకాలంగా మాత్రం ఇండస్ట్రీకి దూరం అయ్యారు. చివరిగా 2013లో ‘రామాచారి’ అనే సినిమలో ఆయన కనిపించారు. ఆ తర్వా మళ్లీ వెండితెరపై వేణు దర్శనం ఇవ్వలేదు. అయితే ఇప్పుడు వేణు వెండితెరపైకి త్వరలో రీఎంట్రీ ఇవ్వనున్నారట. అదీ ఓ స్టార్ హీరో సినిమాలో.. మాస్ మహరాజ ప్రస్తుతం ‘’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. నూతన దర్శకుడు శరత్ మందవ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమా టైటిల్ ప్రకటించిన రోజు నుంచి దీనిపై ఏదో ఒక అప్డేట్ ఇస్తుంది చిత్ర యూనిట్.. ఈ మధ్యే ఈ సినిమాలో హీరోయిన్లుగా దివ్యాంషా కౌశిక్, రజిషా విజయన్లు నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. తాజాగా ఈ సినిమాలో వేణు తొట్టెండపూడి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని చిత్ర యూనిట్ ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించి ఆయన్ని టీమ్లో ఆహ్వానిస్తూ.. సోషల్మీడియాలో ఓ పోస్ట్ కూడా చేసింది. ఈ సినిమాలో వేణుది చాలా కీలకమైన పాత్ర అని తెలుస్తోంది. మరి ఈ సినిమా తర్వాత అయినా.. వేణుకి మళ్లీ బ్రేక్ వచ్చి.. ఆయన టాలీవుడ్లో మంచి పాత్రలు సాధించాలని ఆయన అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. Read Also:
from https://ift.tt/3zNjdKF
No comments:
Post a Comment