మూడు సంవత్సరాల విరామం తర్వాత ‘వకీల్ సాబ్’ సినిమాతో మంచి సక్సెస్ని అందుకున్నాడు పవర్స్టార్ పవన్కళ్యాణ్. శ్రీ రామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఎక్కడ చూసిన సినిమాపై పాజిటివ్ రెస్పాన్స్లే వస్తున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత పవన్కళ్యాణ్.. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’తో పాటు సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ సినిమా రీమేక్లలో నటిస్తున్నాడు. అయితే సాధారణంగా పవన్కళ్యాణ్తో సినిమా చేసేందుకు ఎందరో డైరెక్టర్లు రెడీగా ఉంటారు. అయితే సెన్సేషనల్ దర్శకుడు మాత్రం అందుకు భిన్నం. పవన్కళ్యాణ్ తాను సినిమా చేయలేనని వర్మ నిర్మొహమాటంగా చెప్పేశాడు. పవన్కళ్యాణ్ అంటే వ్యక్తిగతంగా తనకు ఇష్టమని చెప్పిన వర్మ.. వకీల్సాబ్ సినిమాను ఇంకా చూడలేదని.. కానీ, రివ్యూలు విన్నానని అన్నాడు. తను తాజాగా దర్శకత్వం వహించిన ‘ఆర్జీవీ దెయ్యం’ సినిమా ప్రమోషన్లో భాగంగా వర్మ ఈ కామెంట్స్ చేశాడు. ‘‘సినిమాల పరంగా కాకుండా పవన్కళ్యాణ్ అంటే నాకు వ్యక్తిగతంగా ఎంతో ఇష్టం. పవన్ సినిమాలు ఎక్కువగా చూడను.. వకీల్సాబ్ కూడా చూడలేదు. కానీ, ట్రైలర్ చూశాను బాగుంది. అయితే పవన్కు ఉన్న ఇమేజ్కి, హీరోయిజం, ఫ్యాన్ ఫాలోయింగ్, ఆయన అభిమానులకు ఉండే అంచనాలకు తగిన సినిమాలు చేయడం నా వల్ల కాదు. హీరోయిజం చూపించే కమర్షియల్ సినిమాలకంటే.. జోనర్ సినిమాలనే నేను ఎక్కువగా రూపొందిస్తాను. అలాంటి హీరోతో నేను సినిమా చేస్తే.. అది వాళ్లకే కాదు, సినిమాకే మంచిది కాదు. అంతేకాక.. కమర్షియల్ సినిమాలు చేయాలనే ఆసక్తి నాకు లేదు’’ అని వర్మ అన్నాడు. రాజశేఖర్ హీరోగా, స్వాతి దీక్షిత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఆర్జీవీ దెయ్యం’. నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్, పెగాసస్ సినీ కార్ప్ యల్.యల్.పి పతాకాలపై జీవిత రాజశేఖర్, నట్టి కరుణ, నట్టి క్రాంతి, బోగారం వెంకట శ్రీనివాస్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాని ఈ నెల 16వ తేదీన తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు.
from https://ift.tt/3doEQZz
No comments:
Post a Comment