తరచూ ఏదో ఒక అంశంపై సోషల్మీడియాలో పోస్ట్ చేస్తూ.. కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంటాడు దర్శకుడు . ప్రస్తుతం దేశంలో కరోనా రెండో దశలో విస్తృతంగా వ్యాపిస్తోంది. అయితే తాజాగా జరుగుతున్న కుంభమేళ జరిగుతున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తిని ఏ మాత్రం పట్టించుకోకుండా.. లక్షల సంఖ్యలో ఈ కుంభమేళలో పాల్గొన్నారు. అయితే ఈ విషయంపై వివాదం సృష్టించాడు వర్మ. కోవిడ్ వ్యాపిస్తున్న తరుణంలో కుంభమేళ నిర్వహించడంపై తనదైన స్టైల్లో సెటైర్లు వేశాడు. కుంభమేళాకు హాజరైన జనాల ఫొటోని షేర్ చేసిన వర్మ.. కుంభమేళ అనేది ఇండియాకు గుడ్బై చెబుతూ.. కరోనాను వెల్కమ్ చేస్తోంది అంటూ ట్వీట్ చేశాడు. ‘ఆహా.. బాగుంది.. అద్భుతం.. ఇవి నా మాటలు కావు. కరోనా మాటలు. ఇది సెట్ చేయాలి అంటే ఎన్ని లాక్డౌన్లు కావాలి’ అంటూ వర్మ మరో ట్వీట్ చేశాడు. అయితే వర్మ ఇంతటితో ఆగలేదు. గత ఏడాది మార్చిలో ఢిల్లీలోని తబ్లిగీ జామాత్లో జరిగిన సమ్మేళనం కరోనా వ్యాప్తికి కారణం అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కుంభమేళతో పోల్చిన వర్మ ‘కుంభమేళ బాహుబలిలా ఉంటే.. మార్చి 2020లో జరిగింది ఓ షార్ట్ ఫిలిమ్లా ఉంది’ అంటూ ట్వీట్ చేశాడు. ‘ఈ సందర్భంగా మన హిందువులు అందరూ ముస్లింలకు క్షమాపణలు చెప్పాలి. ఎందుకంటే వాళ్లు ఏమీ తెలియనప్పుడు చేశారు.. మనం మాత్రం ఒక సంవత్సరం అనుభవం ఉన్నా చేస్తున్నాం’ అంటూ ట్వీట్ చేసి.. సరికొత్త వివాదం సృష్టించాడు వర్మ. అంతేకాక.. ‘విశ్వం అనంతం అనే విషయం నాకు తెలియదు కానీ.. మూర్ఖత్వం అనేది మాత్రం అనంతం’ అని ప్రముఖ శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పిన మాటని మరో ట్వీట్లో పేర్కొన్నా ఆర్జీవీ.. ఇలాంటి మూఢ నమ్మకాలు ఎందుకో భగవంతుడికే తెలియాలి అని పేర్కొన్నాడు వర్మ.
from https://ift.tt/3sf4fZu
No comments:
Post a Comment