తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొంతకాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకుంది కన్నడ భామ మందన్న. నాగశౌర్య హీరోగా నటించిన ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్కి పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రష్మిక బాలీవుడ్లోనూ నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటికే సిద్ధార్త్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ‘మిషన్ మజ్ను’ సినిమాలో హీరోయిన్గా చేస్తున్న ఈ భామ.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్తో ‘గుడ్ బాయ్’ అనే సినిమాలో నటిస్తోంది. అయితే అమితాబ్ బచ్చన్తో కలిసి నటించడం తను జీవితాంతం మర్చిపోలేనని రష్మిక తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ నెల ఏప్రిల్ 5న రష్మిక ‘గుడ్ బాయ్’ సెట్స్తో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అమితాబ్ బచ్చన్తో కలిసి నటిస్తున్నానంటే.. తన తల్లిదండ్రులు నమ్మలేదని రష్మిక తెలిపింది. ‘మా అమ్మా, నాన్న ఇద్దరు అమితాబ్కు అభిమానులు. ఆయన సినిమాలు అన్ని వాళ్లు తప్పకుండా చూస్తారు. అలాంటిది నేను ఆయనతో కలిసి నటిస్తున్నాను అంటే వాళ్లు ముందు నమ్మలేదు. ఇక నా పుట్టిన రోజును గుడ్ బాయ్ సెట్స్లో జరుపుకున్నాను.. ఆ అనుభవం ఎప్పటికీ మర్చిపోలేనిది’ అని రష్మిక పేర్కొంది. కార్తీ హీరోగా నటించిన ‘సుల్తాన్’ అనే సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది రష్మిక. ఈ సినిమా ఆమెకు ఊహించినంత విజయం అందించలేదు. ప్రస్తుతం ఆమె సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’లో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 13వ తేదీన ఐదు భాషల్లో విడుదల కానుంది.
from https://ift.tt/3e7rkIz
No comments:
Post a Comment