ప్రముఖ కన్నడ నటి.. వార్తల్లో నిలిచింది. గత ఏడాది శాండిల్ఫుడ్ని కుదిపేసిన డ్రగ్స్ కేసులో ఆమె సోదరి మూడు నెలలు జైలుకు వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా నిక్కీ తనకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. తనను ఓ వ్యక్తి మోసం చేశాడంటూ.. ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిఖిల్ హెగ్డే అనే వ్యక్తి తన వద్ద నుంచి తనకు అందాల్సిన డబ్బు అందడం లేదని.. ఈ మేరకు అతను తనని మోసం చేశాడని నిక్కీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 2016లో ఓ గ్రాండ్ కేఫ్ ఓపెన్ చేయాలని ప్లాన్ చేశాడు నిఖిల్ హెగ్డే. ఇందుకోసం అతనికి పెద్ద మొత్తంలో నగదు అవసరం వచ్చింది. దీంతో నిక్కీ వద్ద నుంచి అతను రూ.50 లక్షలు అప్పుగా తీసుకున్నాడట. అయితే అగ్రిమెంట్ ప్రకారం అతను నిక్కీకి.. ప్రతీ నెల లక్ష రూపాయిలు ఇవ్వాలి. కానీ, ఇప్పటివరకూ ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని. అంతేకాక, గత కొంతకాలంగా తన ఫోన్ కాల్స్ కూడా ఎత్తడం లేదని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయగా.. ట్రయల్ కోర్టులో విచారణకు హాజరు కావాల్సిందిగా నిఖిల్కు నోటీసులు జారీ చేశారు. 2014లో సంజనా గల్రాని సోదరిగా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నిక్కీ.. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో 30కి పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక నిక్కీ సోదరి సంజనా చిన్న చితకా పాత్రలు చేసినప్పటికీ హీరోయిన్గా సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. దాదాపు చేసిన అన్ని సినిమాల్లో సైడ్ హీరోయిన్ పాత్రలకే పరిమితమైంది. ఇక తాజాగా డ్రగ్స్ కేసులో కూడా ఇరుక్కుపోవడంతో.. ఆమె కెరీర్ ముగిసినట్లే అని సినీ పెద్దలు అంటున్నారు.
from https://ift.tt/3dnJzKL
No comments:
Post a Comment