మూడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత పవర్స్టార్ టాలీవుడ్కి రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘’. రాజకీయాల కోసం సినిమాలకు దూరమైన పవన్ మళ్లీ వెండితెరపై కనిపిస్తున్నాడని తెలిసి.. ఈ సినిమా చూసేందుకు ఆయన అభిమానులు పోటెత్తారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ సంపాదించుకుంది. ఇక వీకెండ్లోనూ సినిమాను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో రావడంతో సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అయితే ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో థియేటర్ యజమానులు కరోనా నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు. ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లా పర్లాఖెముండిలో రెండు థియేటర్లలో ‘వకీల్సాబ్’ విడుదలైంది. ఈ క్రమంలో ఆదివారం సినిమా చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు. అయితే కరోనా నిబంధనలు ఏ పాటించకుండా రెండు థియేటర్లు సినిమాను ప్రదర్శించాయి. ఇది తెలుసుకున్న అధికారులు వెంటనే ఆ రెండు థియేటర్లను సీజ్ చేశారు. ఇక హిందీలో సూపర్హిట్ సాధించిన ‘పింక్’ సినిమా రీమేక్గా ఈ సినిమాని రూపొందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించగా.. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాశ్ రాజ్లు కీలక పాత్రలో నటించారు.
from https://ift.tt/3mCWkUK
No comments:
Post a Comment