‘పండుగలు ఎన్నో.. ప్రేమ ఒకటే’.. నవ్వుతూ ఫ్యాన్స్‌ని పలకరించిన ప్రభాస్.. రాధేశ్యామ్ పోస్టర్ విడుదల - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday 12 April 2021

‘పండుగలు ఎన్నో.. ప్రేమ ఒకటే’.. నవ్వుతూ ఫ్యాన్స్‌ని పలకరించిన ప్రభాస్.. రాధేశ్యామ్ పోస్టర్ విడుదల

‘బాహుబలి’ చిత్రంతో నేషనల్‌ వైడ్ స్టార్‌డమ్ సంపాదించుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. సినిమా ఎప్పుడు వస్తుందా.. అతన్ని థియేటర్‌లో ఎప్పుడు చూద్దామా అనే రేంజ్‌లో దేశవ్యాప్తంగా అతనికి ఫ్యాన్స్ పెరిగిపోయారు. అయితే అంత భారీ హిట్ చిత్రం తర్వాత ప్రభాస్ ‘రన్‌ రాజా రన్’ ఫేమ్ దర్శకుడు సుజిత్ డైరెక్షన్‌లో ‘సాహో’ అనే యాక్షన్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను కాస్త నిరాశపరిచిందనే చెప్పుకోవాలి. హాలీవుడ్ రేంజ్‌లో సినిమాను రూపొందించినప్పటికీ.. కథలో బలం లేకపోవడంతో సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరక్షన్‌లో చేస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్, గ్లింప్స్‌ని చాలాకాలం క్రితం వదిలారు. ఆ తర్వాత సినిమా యూనిట్ నుంచి ఎటువంటి అప్‌డేట్ లేదు. దీంతో కొద్దిరోజుల క్రితం నిర్మాణ సంస్థను టార్గెట్ చేస్తూ.. ‘నిద్ర లే యూవీ క్రియేషన్స్’ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ట్విట్టర్‌లో రచ్చ చేశారు. అయితే ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి ప్రభాస్ పోస్టర్‌ని విడుదల చేసి ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చింది రాధేశ్యామ్ యూనిట్. ఈ పోస్టర్‌లో ప్రభాస్ నవ్వుతూ ఫ్యాన్స్‌ని పలకరిస్తున్నాడు. ‘పండుగలు ఎన్నో.. ప్రేమ ఒక్కటే’ అనే క్యాప్షన్‌ని పోస్టర్‌పై ఉంచారు. ఈ పోస్టర్‌ని ప్రభాస్.. ‘ఈ పండుగలు అన్ని మనం సంతోషంగా జరుపుకొనేలా చేసే ఒక బంధమే ప్రేమ. అందరికీ ఉగాది శుభాకాంక్షలు’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశాడు. పిరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది. ఐదు భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమాని రూపొందించారు. ఈ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఈ ఏడాది జూలై 30న విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే మరో గ్రాండ్ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడు. రామాయణ మహాకావ్యం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీతగా కృతి సనన్, లక్షణ్ముడిగా సన్ని సింగ్ నటిస్తుండగా.. ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ లంకేశ్వర రావణాసుర పాత్రలో చేస్తున్నాడు.


from https://ift.tt/3deJx7O

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages