కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు మంచి సందేశంతో కూడిన సినిమాలను తెరకెక్కించే దర్శకుడు . ఇప్పటివరకూ ఆయన తెరకెక్కించిన సినిమాలు అన్ని బ్లాక్బస్టర్లుగా నిలిచాయి. త్వరలో హీరోగా ‘’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు కొరటాల శివ. చిరంజీవి, కొరటాల కాంబో అనగానే సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న మెగా పవర్స్టార్ .. ఈ సినిమాలో సిద్ధ అనే కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఉగాది సందర్భంగా సినిమా యూనిట్ సిద్ధ ప్రేయసి.. నీలాంబరిని పరిచయం చేస్తూ.. పోస్టర్ని విడుదల చేశారు. నీలాంబరి పాత్రలో పూజా హెగ్డే నటిస్తోంది. తాజాగా విడుదలైన పోస్టర్లో చరణ్, పూజా ఓ రొమాంటిక్ పోజ్లో కనిపిస్తున్నారు. ‘షడ్రుచుల సమ్మేళనం మా సిద్ద నీలాంబరిల ప్రేమ’ అంటూ దర్శకుడు కొరటాల శివ ఈ పోస్టర్ని షేర్ చేశారు. ‘ఆయుధమైనా.. అమ్మాయైనా.. సిద్ధుడి చేతిలో ఒదిగిపోతుంది.. ఆచార్య ఉగాది శుభాకాంక్షలు’ అంటూ అంటూ మెగాస్టార్ చిరంజీవి ఈ పోస్టర్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన మరోసారి కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తైంది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయి. నక్సలైట్ బ్యాక్డ్రాప్లో ఓ సందేశంతో రూపొందిన ఈ సినిమా ఈ ఏడాది మే 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
from https://ift.tt/3g5sKWX
No comments:
Post a Comment