టీడీపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత.. బెంగళూరు వెళ్లి నివాళులర్పించిన రామ్ చరణ్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Friday, 20 November 2020

టీడీపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత.. బెంగళూరు వెళ్లి నివాళులర్పించిన రామ్ చరణ్

చిత్తూరు మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే సత్యప్రభ (65) కన్నుమూసిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో బెంగళూరులోని వైదేహి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సత్యప్రభ.. గురువారం రాత్రి గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. ఇటీవలే ఆమె కరోనా వైరస్‌ను జయించారు. అయినప్పటికీ మృత్యువును జయించలేకపోయారు. సత్యప్రభ మృతితో టీడీపీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమెకు నివాళులు అర్పించడానికి చిత్తూరు జిల్లా నుంచి అభిమానులు, టీడీపీ నేతలు బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. ఇదిలా ఉంటే, సినీ నటుడు మెగా పవర్ స్టార్ సైతం సత్యప్రభకు నివాళులర్పించడానికి శుక్రవారం బెంగళూరు వెళ్లారు. ఆయన హాస్పిటల్‌లో నివాళులర్పించి బయటకు వస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హాస్పిటల్ నుంచి బయటికి వస్తోన్న రామ్ చరణ్‌ను తమ ఫోన్లలో బంధించడానికి అక్కడున్న చాలా మంది అభిమానులు ప్రయత్నించారు. వారి మధ్య నుంచి చరణ్ కారు వద్దకు వెళ్లారు. కాగా, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ ఛైర్మన్ డీకే ఆదికేశవులు నాయుడు మరణించిన తరవాత ఆయన సతీమణి అయిన సత్యప్రభ రాజకీయాల్లోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో చిత్తూరు శాసనసభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఇటీవలే సత్యప్రభ రెండోసారి ఎన్నికయ్యారు. Also Read:


from https://ift.tt/3pLXWNf

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages