పదేళ్ల ప్రేమ.. పెద్దల అంగీకారంతో ఫరాను పెళ్లాడిన లిరిసిస్ట్ శ్రీమణి - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Sunday, 22 November 2020

పదేళ్ల ప్రేమ.. పెద్దల అంగీకారంతో ఫరాను పెళ్లాడిన లిరిసిస్ట్ శ్రీమణి

సినీ గేయ రచయిత శ్రీమణి పెళ్లిచేసుకున్నారు. తాను ప్రేమించిన అమ్మాయిని పెద్దల అంగీకారంతో పరిణయమాడారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘నా స్వీట్ లిటిల్ ఏంజెల్ (ఫరా)కు నా జీవితంలోకి స్వాగతం చెబుతున్నాను. ఈ క్షణం కోసం మేమిద్దం గత 10 ఏళ్లుగా వేచి చూస్తున్నాం. మొత్తానికి మా కల నిజమైంది. మా మనసులను అర్థం చేసుకున్న ఆ దేవుడికి, మా తల్లిదండ్రులకు ధన్యవాదాలు’’ అని శ్రీమణి ట్వీట్‌లో పేర్కొన్నారు. శ్రీమణి ట్వీట్‌కి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్పందించారు. శ్రీమణికి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘మీ రొమాంటిక్ లిరిక్స్ వెనకున్న రహస్యమేంటో ఇప్పుడు నాకు అర్థమైంది. ‘ఇష్క్ సిఫాయా’ అని పాడి.. ‘రంగులద్దుకున్న’ అని సీక్రెట్‌గా లవ్ చేసి.. ‘ఏమిటో ఇది’ అని మేమందరం అనుకునేలా పెళ్లిచేసుకున్నారన్న మాట’’ అని సరదాగా రాసుకొచ్చారు దేవి. శ్రీమణి-దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో ఎన్నో హిట్ సాంగ్స్ వచ్చాయి. నిజానికి దేవిశ్రీ ప్రసాద్‌కే శ్రీమణి ఎక్కువ పాటలు రాశారు. పైన దేవి చెప్పిన మూడు పాటలు కూడా ఇటీవల వచ్చి సూపర్ హిట్స్‌గా నిలిచాయి. ఇదిలా ఉంటే, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘100% లవ్’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమై అనతి కాలంలో స్టార్ లిరిసిస్ట్‌గా ఎదిగారు శ్రీమణి. ఆ సినిమాలో ‘ఏ స్క్వేర్ బీ స్క్వేర్’, ‘అహో బాలు’, ‘దటీజ్ మహాలక్ష్మి’ పాటలను శ్రీమణి రాశారు. ఆ తరవాత నాని హీరోగా వచ్చిన ‘సెగ’ సినిమాలోని ‘వర్షం ముందుగా’ పాటతో శ్రీమణికి మంచి గుర్తింపు వచ్చింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాంటి దిగ్గజ గాయకుడి ఆశీస్సులు అందాయి. ఇక అక్కడి నుంచి శ్రీమణి వెనుదిరిగి చూసుకోలేదు. ఇంచుమించుగా ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరితోరనూ ఆయన పనిచేశారు. ముఖ్యంగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని స్టార్ లిరిసిస్ట్‌గా ఎదిగారు శ్రీమణి. ‘జులాయి’, ‘అత్తారింటికి దారేది’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘అజ్ఞాతవాసి’.. ఇలా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో శ్రీమణి పాటలు రాశారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ప్రతి సినిమాలోనూ శ్రీమణి పాట ఉండాల్సిందే. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ‘ఉప్పెన’, ‘రంగ్‌దే’ సినిమాలకు శ్రీమణి సాహిత్యం అందిస్తున్నారు. Also Read:


from https://ift.tt/3m0xlKc

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages