చనుబాలు దానం చేసిన బాలీవుడ్ నిర్మాత.. ఏకంగా 42 లీటర్లు.. పుణ్యమంతా నీదే తల్లి! - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Thursday, 19 November 2020

చనుబాలు దానం చేసిన బాలీవుడ్ నిర్మాత.. ఏకంగా 42 లీటర్లు.. పుణ్యమంతా నీదే తల్లి!

తాప్సి పన్ను ప్రధాన పాత్రలో నిర్మించిన ‘సాంద్ కి ఆంఖ్’ చిత్రంతో పాపులర్ అయిన బాలీవుడ్ నిర్మాత నిధి పర్మార్ హీరానందని తన చనుబాలను దానం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బిడ్డకు జన్మనిచ్చిన నిధి పర్మార్ లాక్‌డౌన్ పీరియడ్‌లో తన చనుబాలను దానం చేశారు. ‘ది బెటర్ ఇండియా’ పోర్టల్‌కు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని నిధి వెల్లడించారు. ‘‘నా బిడ్డకు పాలు ఇచ్చిన తరవాత నా చనుబాలు ఇంకా చాలా మిగిలిపోతున్నాయని నేను గ్రహించాను. చనుబాలను రిఫ్రిజిరేటర్‌లో సరైన పద్ధతిలో ఉంచితే మూడు నుంచి నాలుగు నెలలు నిల్వ ఉంటాయని నేను ఇంటర్నెట్‌లో చదివాను’’ అని నిధి పర్మార్ వెల్లడించారు. అయితే, చనుబాలను ఫేస్‌ ప్యాక్స్‌ వేసుకోవడానికి వాడుకోవచ్చని ఇంటర్నెట్‌లో చాలా మంది సలహాలు ఇచ్చారని నిధి చెప్పారు. అలాగే, తమ చంటి పిల్లలకు స్నానం చేయించడానికి.. తమ పాదాలను శుభ్రం చేసుకోవడానికి కూడా చనుబాలను వాడతామని తన స్నేహితులు కొంత మంది చెప్పారని నిధి తెలిపారు. కానీ, సెలూన్స్‌ను తన చనుబాలను ఇవ్వడం తనకు ఇష్టం లేదని.. అందుకే చనుబాల దానం చేయొచ్చా అనే విషయంపై తాను రీసెర్చ్ చేయడం మొదలుపెట్టానని నిధి చెప్పారు. మొత్తానికి దీని గురించి తెలుసుకుని లాక్‌డౌన్ సమయంలో సుమారు 42 లీటర్ల చనుబాలను దానం చేశానని వెల్లడించారు. Also Read: ‘‘బాంద్రాలోని ఉమెన్స్ హాస్పిటల్‌లో పనిచేస్తోన్న నా గైనకాలజిస్ట్‌ను నేను కలిశాను. చనుబాల దానం గురించి ఆమెను అడిగి తెలుసుకున్నాను. ముంబైలోని ఖర్‌లో ఉన్న సూర్య హాస్పిటల్‌లో చనుబాలు దానం చేయొచ్చని ఆమె నాకు చెప్పారు. అప్పటి నుంచి 150 మిల్లీ లీటర్ల చొప్పున 20 పాల ప్యాకెట్లను నేను ఫ్రిడ్జ్‌లో నిల్వ చేశాను. కానీ, లాక్‌డౌన్ సమయం.. అందులోనూ ఇంట్లో నా బిడ్డను వదిలిపెట్టి బయటకు వెళ్లలేను. ఇలాంటి సమయంలో హాస్పిటల్ నుంచి నాకు మంచి సహకారం అందింది. మా ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి పాల ప్యాకెట్లను జీరో-కాంటాక్ట్ పికప్ చేసుకున్నారు’’ అని నిధి చెప్పుకొచ్చారు. మే నెలలో చనుబాల దానం మొదలుపెట్టిన నిధి.. ప్రతి 15 నుంచి 20 రోజులకు ఒకసారి పాలను హాస్పిటల్‌కు అందజేశారు. నిధి ఇచ్చిన పాలను మిల్క్ బ్యాంక్‌లో స్టోర్ చేసిన హాస్పిటల్ సిబ్బంది వాటిని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉండే నెలలు తక్కువతో పుట్టిన పిల్లలకు పడుతున్నారు. కాగా, ఇలా చనుబాలను దానం చేయడం బహుశా ఇండియాలో ఇదే ప్రథమం అని అంటున్నారు నిపుణులు. ఏదేమైనా, చనుబాలు వృథాగా పోతే పోనీ అని వదిలేయకుండా ఎంతో కష్టపడి వాటిని నిల్వ చేసి ఎంతో మంది చంటి బిడ్డల ఆకలి తీర్చిన నిధికి ఎంత పుణ్యమో.


from https://ift.tt/36TQZkJ

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages