యంగ్ టైగర్ ప్రపంచాన్నే గడగడలాడించనున్నారట. ఈ మేరకు ఆయన క్యారెక్టర్ సిద్ధం చేస్తున్నారట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ సినిమాతో టాలెంట్ రుజువు చేసుకున్న దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ విలక్షణ కాంబోపై ఓ న్యూస్ ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కోసం ఓ పవర్ఫుల్ రోల్ రెడీ చేస్తున్నారట ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఈ న్యూస్ నందమూరి అభిమానులను హుషారెత్తిస్తూ తెగ వైరల్ అవుతోంది. Also Read: ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ఈ మూవీకి 'మిస్సైల్' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారని ఆ మధ్య ప్రచారం జరిగింది. మైత్రీ మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో ఇటీవలే కథా చర్చలు ముగిశాయని, పాన్ ఇండియా మూవీగా భారీ ఎత్తున ఈ సినిమాను రూపొందించనున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీఆర్ క్యారెక్టర్ గురించి బయటకొచ్చిన సమాచారం ప్రేక్షకుల్లో ఆతృత నింపుతోంది. బయోవార్ నేపథ్యంలో ఈ సినిమా కథ రాసుకున్న ప్రశాంత్ నీల్.. ప్రపంచాన్నే గడగడలాడించే పవర్ఫుల్ మాఫియా డాన్లా ఎన్టీఆర్ని చూపించబోతున్నారని తెలుస్తోంది. Also Read: ఈ క్యారెక్టర్ కోసం ఎన్టీఆర్ సరికొత్తగా మేకోవర్ కాబోతున్నారని తెలుస్తుండటం మరింత ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్ పోషించనున్న ఈ క్యారెక్టర్తో ఆయన పాన్ ఇండియా స్టార్ కావడం ఖాయం అని చెప్పుకుంటున్నారు ఫిలిం నగర్ జనం. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ కేటాయించి భారీ ఎత్తున ఈ సినిమా రూపొందించనున్నారట మైత్రి నిర్మాతలు. ఇకపోతే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR మూవీ చేస్తున్న ఎన్టీఆర్.. అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేసి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్తో సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈ మూవీ ఫినిష్ అయిన వెంటనే ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబో లైన్ లోకి రానుందనేది లేటెస్ట్ సమాచారం.
from https://ift.tt/32LCIFJ
No comments:
Post a Comment