డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ హీరోయిన్ రకుల్ప్రీత్ సింగ్కు ఉచ్చు బిగుసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ కేసులో ఆమెను విచారించేందుకు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు త్వరలోనే నోటీసులు జారీచేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. డ్రగ్స్ వ్యవహారంలో రకుల్కు ఉచ్చు బిగుసుకోవడం ఖాయమంటూ సోషల్మీడియా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే దీనిపై ఎన్సీబీ అధికారుల నుంచి మాత్రం ఎలాంటి సమాచారం రావడం లేదు.
సుశాంత్సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో అతడి ప్రియురాలు రియా చక్రవర్తిని అరెస్ట్ చేయడంతో బాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. పోలీసులు విచారణలో రకుల్ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ పేర్లను రియా బయటపెట్టింది. దీంతో రకుల్పై సోషల్మీడియాలో ఓ రేంజ్లో ట్రోలింగ్ జరిగింది. ఈ దెబ్బకు వికారాబాద్లోని షూటింగ్ స్పాట్ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయింది. ఆ వెంటనే మీడియాలో తనపై వస్తున్న కథనాలను నిలిపివేసేలా ఆదేశాలివ్వాలంటూ రకుల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే మీడియా కథనాలపై తాము ఆదేశాలివ్వలేమని జస్టిస్ నవీన్ చావ్లా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో మీడియానే స్వీయ నియంత్రణ ఇవ్వాలని పేర్కొంది. రకుల్ పిటిషన్ను ఫిర్యాదుగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ, ప్రసార భారతి, న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్, ప్రెస్ కౌన్సిల్కు ఢిల్లీ హైకోర్టుకు నోటీసులు జారీ చేసింది. from https://ift.tt/3ksMYc2
No comments:
Post a Comment