సుకుమార్, కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి తెరకెక్కుతున్న సినిమా ‘పుష్ప’. బన్నీ తన కెరీర్లోనే తొలిసారి విభిన్న పాత్ర పోషిస్తున్నాడు. గంధపు చెక్కల స్మగ్లర్ పాత్ర కోసం ఆయన డిఫెరెంట్ మేకోవర్తో రెడీ అయ్యారు. కథ నేపథ్యంలో ఈ సినిమా అంతా అటవీ ప్రాంతంలోనే తెరకెక్కాల్సి ఉంది. ఇందుకోసం కేరళ అడవులను సెలక్ట్ చేసుకుని షూటింగ్ కూడా మొదలుపెట్టేశారు. తీరా బన్నీ యూనిట్తో జతకలిసే సమయానికి లాక్డౌన్ అమల్లోకి వచ్చింది.
దీంతో ఈ సినిమాను ఏపీలోని రంపచోడవరం, తెలంగాణలోని వికారాబాద్, మహబూబ్నగర్ అడవుల్లో తెరకెక్కించనున్నారంటూ కొద్దిరోజుల క్రితం ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని కొట్టేసిన సుకుమార్ కేరళ అడవుల్లోనే షూటింగ్ జరుగుతుంది క్లారిటీ ఇచ్చారు. కేరళ బ్యాక్డ్రాప్తో తెరకెక్కిస్తే ప్రేక్షకులకు కొత్తదనం అందించినట్లు ఉంటుందని, బన్నీకి కేరళలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో తమకు కలిసొస్తుందని యూనిట్ భావిస్తోంది. Also Read: దీంతో త్వరలోనే పుష్ప యూనిట్ కేళ అడవుల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతోందట. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ తీర్చిదిద్దేందుకు సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్లో మెగాస్టార్ ‘ఆచార్య’ విడుదలయ్యే అవకాశం ఉండటంతో.. ‘పుష్ప’ను మే లేదా జూన్ నెలల్లో రిలీజ్ చేసేలా యూనిట్ యోచిస్తోంది. ఈ సినిమాలో బన్నీ సరసన కన్నడ భామ రష్మిక మందానా నటిస్తోంది. Also Read:from https://ift.tt/3kKr3Nu
No comments:
Post a Comment