నా డ్రీమ్ ఇప్పటికీ తీరింది: దేవీశ్రీ ప్రసాద్ ఎమోషనల్ పోస్ట్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Saturday 19 September 2020

నా డ్రీమ్ ఇప్పటికీ తీరింది: దేవీశ్రీ ప్రసాద్ ఎమోషనల్ పోస్ట్

టాలీవుడ్‌లో మ్యూజిక్‌ డైరెక్టర్‌‌గా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు . కొన్ని వందల సినిమాలకు సంగీతం అందించిన ఆయనకు కొన్నాళ్లుగా ఓ కల మిగిలిపోయింది. తన గురువు మాండలిన్ శ్రీనివాస్‌తో కలిసి సాంగ్ కంపోజ్ చేయాలని ఎన్నాళ్లుగానో అనుకుంటున్నారు. ఆయన ఆరేళ్ల క్రితం పరమపదించడంతో దేవీ చాలా బాధపడ్డారు. గురువుతో కలిసి కంపోజ్ చేయాలన్న తన కోరిక ఇప్పుడు సగం తీరిందని ఆయన తెలిపారు. "మాండలిన్‌ శ్రీనివాస్‌ గారిని కంపోజిషన్‌ చేయాలని అనుకున్నప్పటికీ ఆయనపై ఉన్న గౌరవంతో ఎప్పుడూ అడిగే ధైర్యం చేయలేదు. ఒకవేళ అడిగి ఉంటే ఒప్పుకునేవారేమోనని ఇప్పుడు అనిపిస్తుంది. ఆయన పరమపదించిన తర్వాత ఇటీవల ఆయన సోలో మాండలిన్ ట్రాక్ విన్నాను. దీంతో ఆ ట్రాక్‌లోని కొంత భాగాన్ని ఆర్కెస్ట్రా చేసి నా గురువుకు అంకితమివ్వాలని అనుకున్నాను. శ్రీనివాస్‌ గారి సోదరుడు రాజేశ్‌ గారికకి నా కోరిక చెప్పగానే ఆయన ఒప్పుకుని ఆ ట్రాక్‌ ఇచ్చారు. గురువు గారి కంపోజిషన్‌కు శిష్యుడినైన తాను ఆర్కెస్ట్రా ఇవ్వడంతో నా కల సగం నెరవేరినట్లే. లెగసీ ఫ్రమ్ అన్నయ్య ఆల్బమ్’ అంటూ తన కంపోజింగ్‌ను దేవీశ్రీ ప్రసాద్ యూట్యూబ్‌ ద్వారా విడుదల చేశారు. Also Read:


from https://ift.tt/3kAwiiD

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages