అభిమానుల సందర్శనకు బాలు పార్థివదేహం - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Friday 25 September 2020

అభిమానుల సందర్శనకు బాలు పార్థివదేహం

దిగ్గజ గాయకుడు, గాన గాంధర్వుడు కన్నుమూశారు. సుమారు 50 రోజులు మృత్యువుతో పోరాడిన బాలు.. శుక్రవారం మధ్యాహ్నం 1.04 గంటలకు చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్ అధికారికంగా ప్రకటించారు. కాగా, బాలు పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం చెన్నైలోని సత్యం థియేటర్‌ వద్ద ఉంచనున్నారు. ఇప్పటికే సత్యం థియేటర్ పార్కింగ్ ప్లేస్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం నుంచి అభిమానులను బాలు పార్థివదేహం సందర్శనకు అనుమతించనున్నారు. మరోవైపు, బాలు అంత్యక్రియలను ఆయన ఫామ్ హౌస్‌లో నిర్వహించనున్నట్టు సమాచారం. అక్కడ కూడా కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. ఇదిలా ఉంటే, బాలు మరణవార్త విని ఆయన అభిమానులు తీవ్ర ఉద్వేగానికి గురవుతున్నారు. ఇకపై ఆయన గొంతు వినలేం అనే ఆలోచనే ఎంతగానో బాధిస్తోందని అంటున్నారు. సోషల్ మీడియా ద్వారా అయితే కోట్లాది మంది అభిమానులు సంతాపం వ్యక్తంచ చేస్తున్నారు. Also Read: కాగా, బాలసుబ్రహ్మణ్యం కరోనా నుంచి కోలుకున్నా ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో కన్నుమూశారు. కరోనా వైరస్ సోకడంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చేరారు. మొదట జలుబు, జ్వరం వంటి స్వల్ప లక్షణాలతో బాధపడిన బాలు.. ఆగస్టు 13న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ రోజు నుంచీ ఆయన ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందారు. ఆ తరవాత వెంటిలేటర్‌తో పాటు ఎక్మో (ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సీజనేషన్) సపోర్ట్‌తో బాలుకి వైద్యులు చికిత్స అందించారు. ఫోటోస్:


from https://ift.tt/3kZiqz1

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages