హీరోల వల్లే కాలేదు.. కరోనా టైంలో అనుష్క అరుదైన రికార్డ్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Wednesday 23 September 2020

హీరోల వల్లే కాలేదు.. కరోనా టైంలో అనుష్క అరుదైన రికార్డ్

శెట్టి, మాధవన్ నటించిన ‘నిశ్శబ్దం’ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో అక్టోబర్ 2 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానుంది. ఒక ఓటీటీ ప్లాట్‌ఫాంలో డైరెక్ట్‌గా విడుదలవుతోన్న తొలి త్రిభాషా చిత్రం ‘నిశ్శబ్దం’. ఇప్పటి వరకు ఏ హీరో సినిమా కూడా ఈ విధంగా మూడు భాషల్లో ఒకేసారి నేరుగా ఓటీటీలో విడుదలకాలేదు. ఈ అరుదైన రికార్డును స్వీటీ తన ఖాతాలో వేసుకున్నారు. కాగా, ఇటీవల విడుదలైన ‘నిశ్శబ్దం’ ట్రైలర్‌కు అనూహ్య స్పందన వచ్చింది. ట్రైలర్‌కు వచ్చిన స్పందనపై చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉంది. సినిమాను కచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశాభావంతో ఉంది. ఈ సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. క్రితి ప్రసాద్ స‌మ‌ర్పణ‌లో కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ అసోసియేషన్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపీ సుందర్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా చిత్రీకరణ చాలా వరకు అమెరికాలోనే జరిగింది. ‘నిశ్శబ్దం’లో అనుష్క, మాధవన్‌తో పాటు అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రం ద్వారా హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడ్సెన్ ఇండియన్ సినిమాకు పరిచయమవుతున్నారు. వినికిడి లోపంతో పాటు, మాట్లాడలేని అమ్మాయి పాత్రలో అనుష్క నటించారు. ఆ పాత్ర పేరు సాక్షి. ఆమె ఒక పెయింటర్. తన భర్తతో కలిసి ఒక విల్లాకు వెళ్లినప్పుడు అక్కడ అనుకోకుండా ఒక సంఘటన జరుగుతుంది. ఆ క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌లో సాక్షి చిక్కుకుంటుంది. ఎన్నో మలుపులతో కూడిన ఈ కేస్ ఇన్వెస్టిగేషన్ ప్రేక్షకులకు మంచి థ్రిల్‌ను ఇస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. Also Read:


from https://ift.tt/3iQkpot

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages