నేడు సినిమా ఇండస్ట్రీలో బడా స్టార్స్గా వెలుగొందుతున్న యాక్టర్స్ అంతా ఒకప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న వారే. ఎన్నో ఉలి దెబ్బలు తగిలితే తప్ప శిల శిల్పంగా మారదు అన్నట్లు మన బడా స్టార్స్ అంతా కెరీర్ ఆరంభంలో ఎన్నో కష్టాలు అనుభవించారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ అందరూ కష్టాలు, కన్నీళ్లు, ఎన్నో అవమానాలు ఎదుర్కొని పైకి వచ్చిన వాళ్ళే. కాగా, చిరంజీవికి నెంబర్ స్టార్ కావాలనే కోరిక ఎప్పుడు కలిగిందనే విషయాన్ని మెగాబ్రదర్ బయటపెడుతూ ఆ నాటి పరిస్థితులను వివరించారు. ''చెన్నై ఫిలిం ఇన్స్టిట్యూట్ అన్నయ్య చిరంజీవిది చివరి బ్యాచ్. ఆ తర్వాత ఆ ఇన్స్టిట్యూట్ పేరును అడయార్ ఫిలిం ఇన్స్టిట్యూట్ అని మార్చేశారు. అయితే ఆ సమయంలో అన్నయ్యతో పాటు సుధాకర్, హరి ప్రసాద్ కలిసి ఉండేవారు. ఈ ముగ్గురికీ దగ్గరి స్నేహితుడు యాక్టర్ కమ్ డైరెక్టర్ పురాణం సూరి. అప్పట్లో ఆయన ఫ్యామిలీ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసేది. అయితే ఓ సారి పెద్ద స్టార్ హీరో సినిమా ప్రివ్యూ చూపించేందుకు అన్నయ్యతో పాటు సుధాకర్, హరి ప్రసాద్లను తీసుకెళ్లారు పురాణం సూరి. Also Read: ప్రివ్యూ వేస్తున్న థియేటర్కి వెళ్ళాక వీళ్ళు ముందు వరుస సీట్లలో కూర్చున్నారు. అయితే ఆ సమయంలో సినిమాకు సంబంధించిన వాళ్ళు వచ్చి అన్నయ్యను లేపి ఎక్కడో వెనకాల కూర్చో అని చెప్పారు. అప్పుడు అన్నయ్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా లేచి వెళ్లిపోయారు. ఆ తర్వాత పురాణం సూరి సినిమా టాక్ గురించి తెలుసుకోవడానికి సుధాకర్, హరి ప్రసాద్లతో పాటు అన్నయ్యను కూడా ఇంటికి రమ్మని పిలవగా.. సుధాకర్, హరి ప్రసాద్ వెళ్లారు గానీ అన్నయ్య మాత్రం వెళ్ళలేదు. దీంతో పురాణం సూరి స్వయంగా వచ్చి అన్నయ్యను రమ్మని అనడంతో కోపంగా ఉన్న ఆయన థియేటర్లో జరిగిన విషయం వివరించారు. దీంతో పురాణం సూరి రియాక్ట్ అవుతూ.. వాళ్లంతా అంతేలే వదిలేయ్ కానీ నువ్ తప్పకుండా గొప్పవాడివి అవుతావ్ మాకు తెలుసు అని అన్నారు. అయితే పెద్ద హీరో అవుతాను అని అంతకుముందే అనుకున్న అన్నయ్య, అప్పుడే నెంబర్ వన్ హీరో కావాలని ఫిక్స్ అయ్యారు. అలా మెగాస్టార్గా ఎదిగారు'' అని నాగబాబు తెలిపారు. ఈ మొత్తం విషయాన్ని తనకు పురాణం సూరి స్వయంగా వివరించి చెప్పారని నాగబాబు చెప్పారు.
from https://ift.tt/3hs0Lyn
No comments:
Post a Comment