బాలీవుడ్ యువ హీరో మిస్టరీ నేటికీ కొనసాగుతూనే ఉంది. ఆత్మహత్యగా ద్రువీకరించబడిన ఈ కేసుకు సంబంధించి పోలీసులు విచారణ వేగవంతం చేశారు. సుశాంత్తో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరినీ విచారిస్తూ కీలక సమాచారం సేకరిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కొక్కటిగా బయటకొస్తున్న విషయాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. తాజాగా ఆయన మాజీ సిబ్బంది అంకిత్ ఆచార్య రిపబ్లిక్ టీవీతో మాట్లాడుతూ సంచలన విషయాలు బయటపెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎవరైనా ఆత్మహత్య చేసుకోబోతుంటే వారికి సానుకూల మాటలు చెప్పి ధైర్యాన్ని నూరిపోసే వ్యక్తిత్వం సుశాంత్ సింగ్ది అని, అలాంటి సుశాంత్ సార్ ఆత్మహత్య చేసుకున్నారని తెలియడం తాను నమ్మలేక పోతున్నానని అంకిత్ ఆచార్య అన్నాడు. అంతేకాదు సుశాంత్ డెత్ తర్వాత ఆయన శరీరంపై ఉన్న గాయాలు, మరకలు చూస్తే ఆత్మహత్యగా అనిపించడం లేదని, ఇది ముమ్మాటికి హత్యే అనే ఫీలింగ్ తనదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. Also Read: మృతదేహానికి సంబంధించిన ఫొటోలను చూసిన తర్వాత షాక్ అయ్యానని, ఆయన మెడపై ఉన్న మరకలు, కమిలిన ఆ గాయాలను చూస్తే.. అతని పెంపుడు కుక్క ఫడ్జ్ బెల్ట్తోనే హత్య చేశారనే అనుమానం కలుగుతుందని అంకిత్ చెప్పడం హాట్ ఇష్యూగా మారింది. ఆయన వద్ద పనిచేసినప్పుడు ఫడ్జ్ను బయటకు తీసుకెళ్లడం, ఆ కుక్క బెల్ట్ కడగడం చేసేవాడినని.. సుశాంత్ మెడపై ఆ బెల్ట్ బకెల్ మార్క్ కనిపిస్తోందంటూ ఇప్పటికే ఉన్న అనుమానాలకు రెక్కలు కట్టాడు అంకిత్. సుశాంత్కు నమ్మకంగా పనిచేసే వ్యక్తులను, సిబ్బందిని లాంటి కారణం లేకుండానే రియా చక్రవర్తి ఉద్యోగంలోంచి తీసేసిందని, అప్పుడే తనకు అనేక అనుమానాలు కలిగాయని అంకిత్ చెప్పాడు. ఎవరైనా అనుమానాస్పదంగా మరణిస్తే పోలీసులు వచ్చే వరకు మృతదేహాన్ని ఎవరూ ముట్టుకోవద్దు. కానీ ఆ ఇంట్లో పనిచేసే సిబ్బంది ఎలా ముట్టుకుంటారు? అని అంకిత్ ఆచార్య ప్రశ్నించడం మరిన్ని అనుమానాలు లేవనెత్తుతోంది. దీంతో సుశాంత్ సూసైడ్ చేసుకున్నాడా? లేక హత్య చేశారా? అనేదానిపై మరోసారి చర్చలు ముదిరాయి.
from https://ift.tt/34fNLs5
No comments:
Post a Comment