సింగర్స్ సునీత, మాళవికకు కరోనా పాజిటివ్.. కొంపముంచిన టీవీ ప్రోగ్రాం - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Tuesday 18 August 2020

సింగర్స్ సునీత, మాళవికకు కరోనా పాజిటివ్.. కొంపముంచిన టీవీ ప్రోగ్రాం

ప్రముఖ గాయనీమణులు సునీత, మాళవిక కరోనా బారిన పడ్డారు. పరీక్షల్లో వీరిద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది. ఓ టీవీ ఛానెల్ కోసం రూపొందించిన సంగీత కార్యక్రమంలో పాల్గొన్న వీరిద్దరికీ కరోనా సోకిందట. వీరితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న చాలా మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు సమాచారం. ఈ ఇద్దరు సింగర్లు ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిసింది. ఇంట్లోనే ఉంటూ వైద్యుల సూచన ప్రకారం జాగ్రత్తలు తీసుకుంటున్నారట. మరోవైపు, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయన తీవ్ర అస్వస్థతతో చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అలాగే, సినీ పరిశ్రమ నుంచి బండ్ల గణేష్, రాజమౌళి, డీవీవీ దానయ్య, తేజ, నాగవంశీ మరికొంత మంది ప్రముఖులు కరోనా బారిన పడి కోలుకున్నారు. ఇప్పుడు సింగర్స్ సునీత, మాళవికకు పాజిటివ్ రావడం దురదృష్టకరం. Also Read: సునీత సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ‘గులాబి’ సినిమాతో తన సింగింగ్ కెరీర్‌ను ప్రారంభించిన సునీత.. తొలి పాటతోనే సంగీత ప్రియుల్ని కట్టిపడేశారు. ‘ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు’ అంటూ సునీత పాడిన ఆ పాట ఇప్పటికీ చాలా మందికి ఫేవరేట్. రెండు దశాబ్దాలకు పైగా కొన్ని వేల పాటలను సంగీత ఆలపించారు. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఆమె పాటలు పాడారు. ఇక మాళవిక సైతం సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఇద్దరు గాయనీమణులు ఈటీవీ పాడుతా తీయగా కార్యక్రమం నుంచి వచ్చినవాళ్లే కావడం విశేషం.


from https://ift.tt/3h7aYjv

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages