RRR ఔట్.. రేస్‌లోకి వచ్చిన చిరంజీవి, ప్రభాస్‌, బాలయ్య! - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Saturday 16 May 2020

RRR ఔట్.. రేస్‌లోకి వచ్చిన చిరంజీవి, ప్రభాస్‌, బాలయ్య!

సంక్రాంతి అంటే సినిమా పండుగ.. కొత్త సినిమాలతో థియేటర్స్ అన్నీ కళ కళలాడుతుంటాయి. ప్రతి ఏడాది ఓ అరజడను సినిమాలు థియేటర్స్‌లో సందడి చేస్తుంటాయి. ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలు థియేటర్స్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. జనవరి 9 దర్బార్, జనవరి 11న సరిలేరు నీకెవ్వరు, జనవరి 12న అల వైకుంఠపురములో సినిమాలు విడుదలై హిట్ టాక్ తెచ్చుకోగా ఈ సంక్రాంతి సీజన్‌లో విడులైన కళ్యాణ్ రామ్.. ‘ఎంతమంచివాడవురా’ నిరాశపరిచింది. మొత్తానికి 2020 సంక్రాంతి సీజన్‌లో మంచి మార్కెట్ లభించింది. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలు ఇండస్ట్రీ హిట్ అంటూ పోటీ పడి మరి కలెక్షన్లు పెంచుకుంటూ పోయారు కాబట్టి అసలు వసూళ్లు ఎంతన్నది పక్కన పెడితే ఈ రెండూ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇక రజినీకాంత్ దర్బార్ చిత్రం మంచి టాక్ రాబట్టింది. ఇక వచ్చే సంక్రాంతి ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల చేస్తున్నట్టు రాజమౌళి ప్రకటించడంతో చాలా సినిమాలు విడుదల తేదీని వాయిదా వేసుకుని ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి అటూ ఇటూ సినిమాలు రిలీజ్ చేసుకునేందుకు ప్లాన్ చేసుకున్నారు. అయితే రాజమౌళి సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు అంటే అది ఖచ్చితంగా వాయిదా పడటం ఖాయం అనే సెంటిమెంట్ ఉంది. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ విడుదల తేదీని వాయిదా వేసిన రాజమౌళి ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే జనవరి 8కి ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు అఫీషియల్ ప్రకటన ఇచ్చారు. ఇంతలో లాక్ డౌన్‌ వల్ల షూటింగ్‌కి అంతరాయం ఏర్పడటంతో పాటు రాజమౌళి సినిమా కాబట్టి చెక్కడాలు ఎక్కువగా ఉంటాయి. సో.. ఈ సినిమా మళ్లీ వాయిదా తప్పదని నిర్మాత డీవీ దానయ్య హింట్ ఇచ్చారు. జనవరి 8వ తేదీన RRR మూవీని విడుదల చేయాలని అన్నివిధాలా ప్రయత్నించాం కానీ.. లాక్‌డౌన్ కారణంగా ప్లానింగ్ దెబ్బతిందని ఆయన ప్రకటించడంతో విడుదల కూడా దెబ్బేసినట్టే. సో.. వచ్చే సంక్రాంతి సీజన్ నుండి ఆర్ ఆర్ ఆర్ చిత్రం క్విట్ కావడం దాదాపు ఖాయం కావడంలో మూడు పెద్ద చిత్రాలు బెర్త్ కన్ఫామ్ చేసుకునేందుకు రెడీ అయ్యాయి. ఈ రేస్‌లో ప్రభాస్, మెగాస్టార్, బాలయ్యలు ఉండటం విశేషం. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ మూవీ ‘ఆచార్య’ మేజర్ పార్ట్ షూట్ అయ్యింది.. లాక్ డౌన్ వల్ల మిగతా షూటింగ్‌కి బ్రేక్ పడింది. అయితే ఈ సినిమాను దసరా లేదా దీపావళి విడుదల చేయడానికి ప్లాన్ చేయగా.. ఎలాగూ సంక్రాంతి రేస్ నుంచి ఆర్ ఆర్ ఆర్ తప్పుకోవడం ఖాయంగా కనిపిస్తుండటంతో ‘ఆచార్య’ సంక్రాంతి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సాహో చిత్రం తరువాత ప్రభాస్.. జిల్ ఫేమ్ రాధాక్రిష్ణతో పీరియాడిక్ లవ్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా 50 శాతం షూటింగ్ పూర్తి కావడంతో వచ్చే సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బాలయ్య బాబు సినిమా సంక్రాంతికి వచ్చిందంటే పక్కా హిట్ అనే సెంటిమెంట్ ఉండటంతో.. తనకు బాగా కలిసి వచ్చిన బోయపాటితో పవర్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌‌లో నటిస్తున్నారు బాలయ్య. ఈ మూవీ శరవేగంగా పూర్తి చేసి 2021 సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి వచ్చే సంక్రాంతికి ముగ్గురు స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు. మరి ఈ సంక్రాంతి రేస్‌లోకి ఇంకెవరు వచ్చి చేరతారో చూడాలి.


from https://ift.tt/2WB4XDP

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages