మెగా ఫ్యామిలీలో ఎవరు ఎలా ఉన్నా.. రామ్ చరణ్-పవన్ కళ్యాణ్ల మధ్య బంధం బలమైనదే. తన బాబాయ్ అంటే అమితమైన ఇష్టం. పవర్ స్టార్ని అభిమానించే వ్యక్తుల్లో తనది తొలి స్థానం అంటూ పలు సందర్భాల్లో చెప్తూ వచ్చిన రామ్ చరణ్.. ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలనేది అభిమానుల కల. మెగా హీరోలు ఒకరి సినిమాల్లో ఒకరు గెస్ట్ రోల్స్లో కనిపిస్తున్నా.. ఫుల్ లెంగ్త్ రోల్లో కనిపించడం లేదు. అల్లు అర్జున్, రామ్ చరణ్ కలిసి ‘ఎవడు’ చిత్రంలో స్క్రీన్ షేర్ చేసుకుని మెగా అభిమానుల్లో ఉత్సాహం నింపారు. అయితే , రామ్ చరణ్లను ఒకే సినిమాలో చూడాలన్న కల తీరేందుకు కాస్త సమయం పట్టినా.. ఈ ఇద్దరూ కలిసి ఒకే సినిమాకి పనిచేయబోతున్నారు. రామ్ చరణ్ నిర్మాణంలో పవన్ కళ్యాణ్ రెండు వరుస సినిమాలు చేయబోతున్నారు. కొణెదల ప్రొడక్షన్స్ కంపెనీలో నిర్మాతగా మెగాస్టార్తో ఖైదీ నెం.150, సైరా, ఆచార్య సినిమాలను నిర్మిస్తున్న రామ్ చరణ్ తన బాబాయ్ని సైతం లైన్లోకి తీసుకువస్తున్నారట. మలయాళ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘డ్రైవింగ్ లైసెన్స్’ రీమేక్ రైట్స్ను సొంతం చేసుకున్నారట రామ్ చరణ్. ఈ సినిమాలో తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక దీంతోపాటు తమిళ సూపర్ హిట్ చిత్రం ‘విక్రమ్ వేద’ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్లో మాధవన్, విజయ్ సేతుపతిలు నటించగా.. తెలుగులో పవన్, రవితేజలు నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి డాలీ లేదా బాబీలలో ఎవరో ఒకరు డైరెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుండగా.. పవన్తో పాటు రవితేజ కంటే రామ్ చరణ్ అయితే బెటర్ అనే సలహా దర్శకుల నుంచి వస్తుండటంతో పవన్-రామ్ చరణ్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.
from https://ift.tt/2LnrPQX
No comments:
Post a Comment