ఆ పాటను అంకితం చేయడం సంతోషంగా ఉంది.. నాగార్జున ట్వీట్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Tuesday 12 May 2020

ఆ పాటను అంకితం చేయడం సంతోషంగా ఉంది.. నాగార్జున ట్వీట్

నాగర్జున నటించిన సినిమాల్లో క్రిమినల్ ఎవర్ గ్రీన్ బెస్ట్ మూవీ. ఈ సినిమాను... అందులోని పాటల్ని ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. 25 ఏళ్ళ క్రితం మహేష్ భట్ దర్శకత్వంలో క్రిమినల్ చిత్రం తెరెక్కింది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు లభించాయి. తెలుగులో నాగార్జున, రమ్యకృష్ణ, మనీషా కోయిరాలా ముఖ్య పాత్రలు పోషించగా, ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ కొందరు ఎంతో ఇష్టంగా వింటుంటారు. ఇక ఈ సినిమాలో ‘తెలుసా... మనసా... ఇది ఏనాటి అనుబంధమో .. తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో. విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో.. శత జన్మాల బంధాల బంగారు క్షణమిది!’ అంటూ సాగే ఈ పాట ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్. ఈ సాంగ్‌ను ఎవరూ మరిచిపోలేరు. అయితే తాజాగా మరోసారి ఈ పాట హాట్ టాపిక్‌గా మారింది. మరోసారి ఈ పాటకు సంబంధించిన హిందీ, తెలుగు వర్షెన్‌ని అనూప్ శంకర్ స్వయంగా పాడి సమాజానికి సేవ చేసే నిస్వార్థ హృదయాలకు అంకితమిస్తున్నట్టు పేర్కొన్నాడు. లాక్ డౌన్ సమయంలో మన కోసం నిరంతరం డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు శ్రమిస్తున్న విషయం తెలిసిందే. వారికి అంకింతం చేస్తు ఈ పాటను ఆయన మరోసారి అద్బుతంగా పాడారు. ఈ విషయం తెలుసుకున్న నాగార్జున తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ఈ పాటను నిస్వార్ధ సేవ చేస్తున్న వారికి అంకితం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. కీరవాణి స్వరపరచిన ఈ అందమైన పాట 25 ఏళ్లు పూర్తి చేసుకుంది అంటూ నాగ్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. తెలుసా మనసా పాటకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ అందించగా, పాటను బాలు, చిత్ర అద్భుతంగా ఆలపించారు.


from https://ift.tt/2LlqGJG

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages