తెలుగు ఛానెల్‌లో ‘కె.జి.ఎఫ్’ సినిమా: నిర్మాత ఆగ్రహం.. చర్యలకు సిద్ధం - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday 11 May 2020

తెలుగు ఛానెల్‌లో ‘కె.జి.ఎఫ్’ సినిమా: నిర్మాత ఆగ్రహం.. చర్యలకు సిద్ధం

కన్నడ చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచిన సినిమా ‘కె.జి.ఎఫ్’. కన్నడ రాక్‌స్టార్ యశ్ హీరోగా రెండేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. సుమారు రూ.250 కోట్లు వసూలు చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ కూడా వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, ‘కె.జి.ఎఫ్: చాప్టర్ 1’ తెలుగు శాటిలైట్ హక్కులను ఇప్పటి వరకు ఏ ఛానెల్‌కు విక్రయించలేదు. డిజిటల్ రైట్స్ మాత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోకు విక్రయించారు. ఈ సినిమా టీవీలో ఎప్పుడొస్తుందా అని చాలా మంది ‘కె.జి.ఎఫ్’ ఫ్యాన్స్ చూస్తున్నారు. అయితే, ఒక లోకల్ తెలుగు ఛానెల్ ఇటీవల ‘కె.జి.ఎఫ్’ను ప్రసారం చేసేసింది. అది ఎక్కడి ఛానెలో తెలీదు కానీ.. దీనిపై చిత్ర నిర్మాత కార్తీక్ గౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఛానెల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన తాజాగా ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఛానెల్‌లో ‘కె.జి.ఎఫ్’ ప్రసారమైనప్పుడు తీసిన ఫొటోను కూడా ట్వీట్‌లో పొందుపరిచారు. Also Read: ‘‘ఎవెరీ అనే ఒక తెలుగు లోకల్ ఛానెల్ అన్యాయంగా కె.జి.ఎఫ్‌ను ప్రసారం చేస్తోంది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నాం. వారి చర్యలపై దావా వేస్తాం. శాటిలైట్ డీల్‌పై చర్చలు జరుగుతున్నాయి, ఇంచుమించుగా ఫైనల్ అయిపోయాయి, ఇలాంటి సమయంలో కేబుల్ ఛానెల్ ఈ పని చేసింది. స్క్రీన్ షాట్స్, వీడియోలు వంటి ఆధారాలు మేం తీసి పెట్టుకున్నాం’’ అని కార్తీక్ గౌడ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ‘కె.జి.ఎఫ్: చాప్టర్ 2’ సినిమాను అక్టోబర్ 23న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అయితే, లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోవడంతో విడుదల తేదీ మారే అవకాశం ఉంటుందంటున్నారు. ఈ సినిమాలో సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి బాలీవుడ్ స్టార్లతో పాటు తెలుగు నటుడు రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తు్న్నారు.


from https://ift.tt/2WR3V5T

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages