వైజాగ్ నాకెంతో స్పెషల్... ఇలా చూస్తుంటే అల్లు అర్జున్ ఆవేదన - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Thursday 7 May 2020

వైజాగ్ నాకెంతో స్పెషల్... ఇలా చూస్తుంటే అల్లు అర్జున్ ఆవేదన

వైజాగ్ గ్యాస్ లీకేజీ ఘటనపై టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. వైజాగ్‌లో ఇప్పటికే అనేక సినిమాల షూటింగ్స్ జరిగాయి. దీంతో విశాఖపట్నంతో ఎందరో సినీ ప్రముఖులకు ప్రత్యేక అనుబంధం ఉంటుంది. అంతేకాకుండా విశాఖ అనేక మంది హీరోలకు కూడా చాలా బాగా కలిసి వచ్చింది. అందులో ఒకరు. బన్నీకి వైజాగ్ అంటే ఎంతో ఇష్టం. అందుకే తన సినిమాలు చాలా వరకు వైజాగ్‌లోనే షూటింగ్ చేసుకుంటూ ఉంటాడు. బన్నీకి వైజాగ్ అంటే కూడా ప్రత్యేక అభిమానం. తాజాగా విశాఖలో గ్యాస్ లీకేజీ ఘటన జరగడంతో బన్నీ స్పందించాడు. తనకు ఎంతో ఇష్టమైన ప్రాంతాల్లో వైజాగ్ ఒకటన్నాడు అల్లు అర్జున్.అలాంటి సిటీని ఇలా చూస్తుంటే గుండె ముక్కలవుతుందని ఆయన ట్వీట్ చేశాడు. ఈ దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. మృతి చెందిన కుటుంబాలకు బన్నీ సంతాపం తెలిపాడు. బాధితులంతా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానన్నాడు. మరోవైపు ఈ దుర్ఘటనపై విశాఖ టాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి విశాఖలో విషవాయువు బారిన పడి ప్రజలు మరణించడం మనసును కలచివేసిందని చెప్పారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అస్వస్థతకు గురైన వారంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. లాక్ డౌన్ తరువాత ఓపెన్ చేసే ఫ్యాక్టరీలలో సంబంధిత అధికారులు ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ ఘటనపై స్పందించారు. వైజాగ్ గాస్ లీక్ వార్త నన్ను తీవ్రంగా కలచివేసిందన్నారు. ప్రభావిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు. స్టే స్ట్రాంగ్ వైజాగ్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా ఆయన యాడ్ చేశారు. మహేష్ బాబు కూడా ఈ ఘటనపై స్పందించారు. సూపర్ స్టార్ మహేష్ స్పందిస్తూ ఘటన చాలా బాధాకరం అని చెప్పారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విశాఖ గ్యాస్ లీకేజీ గురించి తెలిసి షాక్ కు గురయ్యాయని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. హీరోయిన్స్ రకుల్, తమన్నా కూడ విశాఖ దుర్ఘటనపై ట్వీట్ చేశారు.


from https://ift.tt/2SHYipi

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages