కాంట్రవర్సీ క్రియేట్ చేయడంలోనూ, తన మాటలతో కడుపుబ్బా నవ్వించడంలోనూ బండ్ల గణేష్ది ప్రత్యేక శైలి. నటుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా, రాజకీయవేత్తగా అందరికీ సుపరిచితమైన ఆయన.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యమ యాక్టివ్ అయ్యారు. ప్రతీ విషయంపై కామెంట్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. మొన్నటికి మొన్న 'గబ్బర్ సింగ్' సినిమా విడుదలై ఎనిమిదేళ్ళయిన సందర్బంగా నానా హంగామా చేసిన .. తాజాగా సూపర్ స్టార్ న్యూ లుక్పై కామెంట్ చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. లాక్డౌన్ కారణంగా షూటింగ్స్ అన్నీ నిలిచిపోవడంతో ఇంటికే పరిమితమైన మహేష్ బాబు.. తన కొడుకు గౌతమ్, కూతురు సితారలతో సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళతో ఆటలాడుతూ, పాటలు పాడుతూ ఉల్లాసంగా ఉంటున్నారు. ఇక భర్త, పిల్లల హోమ్ క్వారంటైన్ తాలూకు విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ సూపర్ స్టార్ అభిమానుల్లో నూతనోత్సాహం నింపుతోంది నమ్రత శిరోద్కర్. మహేష్కి సంబంధించి రోజుకో కొత్త లుక్ షేర్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె చేసిన ఓ పిక్ నెట్టింట వైరల్ అయింది. పిల్లలు గౌతమ్, సితారలతో మహేష్ బాబు తీసుకున్న సెల్ఫీ పిక్ ఇది. ఇందులో కళ్ళజోడు ధరించి కనిపిస్తున్న మహేష్ బాబు నెటిజన్స్ చూపు తిప్పుకోలేని విధంగా అట్రాక్ట్ చేస్తున్నారు. దీంతో.. 'ఆయన తండ్రిలా కాదు పిల్లలకు అన్నయ్యాలా ఉన్నదంటూ కామెంట్స్ చేస్తున్నారు చేస్తున్నారు నెటిజన్లు. Also Read: అయితే ఈ పిక్ బండ్ల గణేష్ కంట పడింది. దీంతో వెంటనే ఆయనలోని క్రియేటివిటీకి పదును పెడుతూ స్వీట్ కామెంట్ వదిలారు. ''మహేష్ సర్ మీరు హాలీవుడ్ సూపర్ స్టార్లా ఉన్నారు'' అంటూ ఆ పిక్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు బండ్ల గణేష్. దీంతో ఇది చూసిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటూ ‘మీరు నిజం చెప్పారు సార్’ అంటూ బండ్ల గణేష్ని తెగ పొగిడేస్తున్నారు. ఇటీవలే మహేష్ హీరోగా వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో బండ్ల గణేష్ నటించారు.
from https://ift.tt/2LC9mjS
No comments:
Post a Comment